- Home
- Feature
- world’s longest train : 7 కిలొమీటర్ల పెద్ద రైలే..! ప్రపంచంలోనే అతి పొడవైన ట్రైన్ ఏదో తెలుసా?
world’s longest train : 7 కిలొమీటర్ల పెద్ద రైలే..! ప్రపంచంలోనే అతి పొడవైన ట్రైన్ ఏదో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఏదో తెలుసా? దీని పొడవే 7 కిలోమీటర్లకు పైగా ఉంటుందట.. ఏకంగా 682 వ్యాగన్లను, 8 ఇంజన్లను కలిగి ఉంటుందట. ఈ రైలు బరువెంతో తెలిస్తే అవాక్కవడం ఖాయం.

ప్రపంచంలోనే పొడవైన రైలు ఏది?
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఆస్ట్రేలియాలో ఉంది. దీని పొడవు ఏకంగా 7 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఈ భారీ రైలు 682 వ్యాగన్లను కలిగివుండగా, వాటిని లాగడానికి ఏకంగా 8 శక్తివంతమైన ఇంజన్లు ఉంటాయి. అయితే ఇది ప్రయాణికులను తీసుకెళ్లే ప్యాసింజర్ ట్రైన్ కాదు, కేవలం సరుకు రవాణా చేసే గూడ్స్ రైలు. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద మైనింగ్ కంపెనీ BHP సంస్థకు చెందిన 'ఐరన్ ఓర్'ను ఈ రైలు నిరంతరం సరఫరా చేస్తుంది. ఈ రైలు నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి.
ఇండియాలో అతి పొడవైన రైలు ఏదో తెలుసా?
భారతదేశంలో కూడా ఇలాంటి రైలే గతేడాది నుండి పట్టాలపై పరుగుతీస్తొంది, వేలు, లక్షల టన్నుల సరుకును సరఫరా చేస్తోంది... దానిపేరు 'రుద్రాస్త'. ఇది ఏకంగా 4.5 కిలోమీటర్లు పొడవు ఉంటుంది… అయిదే ఇదీ ఆస్ట్రేలియా రైలులాగే గూడ్స్ ట్రైన్... అంటే ప్రయాణికుల రవాణాకు కాకుండా సరుకుల రవాణాకు ఉపయోగిస్తారు. 354 వ్యాగన్లు (బోగీలు) కలిగిన ఈ ట్రైన్ ను లాగడానికి 7 శక్తివంతమైన ఇంజన్లు ఉంటాయి.
సాధారణంగా ఇండియన్ రైల్వేలో గూడ్స్ రైలుకు 40 నుండి 60 వరకు వ్యాగన్లు ఉంటాయి... కానీ ఈ రుద్రాస్త రైలుకు మాత్రం 354 ఉన్నాయి. అంటే ఆరు సాధారణ గూడ్స్ ట్రైన్స్ ను కలిపితే ఒక్క రుద్రాస్తకు సమానం. ఇలా ఒకే రైలుకు అత్యధిక బోగీలు కలిగివుండటం ద్వారా ఎక్కువ సరుకు రవాణా చేయవచ్చు... పదేపదే గూడ్స్ రైళ్ల కోసం ప్రయాణికుల రైళ్లను ఆపే అవసరం ఉండదు.
ప్రపంచంలో అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు ఏది?
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు స్విట్జర్లాండ్లో పరుగులు తీస్తోంది. దీని పొడవు ఏకంగా 1.9 కిలోమీటర్లు, 100 కోచ్లను కలిగి ఉంటుంది. ఈ రైలు నిత్యం వేలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఇది యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ప్రాచీన అల్బూలా రైల్వే మార్గం గుండా ప్రయాణిస్తుంది... ప్రముఖ ఆల్ప్ పర్వతాల మీదుగా ప్రయాణం సాగుతుంది. దీని బరువు 2,990 టన్నులు ఉంటుంది... 4,550 సీట్ల సామర్థ్యం కలిగివున్న ఈ రైలు 30 నుండి 40 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
ఇండియాలో పొడవైన ప్యాసింజర్ రైలు ఏది?
భారతదేశంలో అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలు ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్. ఇది ఏకంగా 24 కోచ్లను కలిగి ఉంటుంది. దేశంలో అత్యధిక కోచ్లతో నడిచే ఈ రైలు వేలాదిమంది ప్రయాణికులను తీసుకెళ్తుంది.
అయితే అత్యంత దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్. ఈ రైలు అస్సాంలోని దిబ్రూఘర్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. దాదాపు 4,273 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి దీనికి 82 గంటలు అంటే నాలుగు రోజులు పడుతుంది. ఈ రైలు ప్రయాణం దేశంలోని భౌగోళిక వైవిధ్యాన్ని చూపుతుంది.
రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు
ప్రపంచవ్యాప్తంగానే కాదు భారతదేశంలో నడుస్తున్న ఈ అతి పొడవైన రైళ్లు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని 7 కిలోమీటర్ల గూడ్స్ రైలు భారీ ఖనిజాలను, భారతదేశంలోని 4.5 కిలోమీటర్ల రుద్రాస్త్ర రైలు వేల టన్నుల సరుకును తక్కువ సమయంలోనే చేరవేస్తాయి. స్విట్జర్లాండ్ లోని 1.9 కిలోమీటర్ల ప్యాసింజర్ రైలు ఒకేసారి వేలాదిమందిని తరలిస్తుంది. ఈ భారీ రైళ్లు ఎక్కువ సరుకును లేదా ప్రయాణికులను ఒకేసారి తరలించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుతాయి. రవాణా ఖర్చులను తగ్గించి, సమయాన్ని ఆదా చేస్తాయి. ఇది రవాణా రంగంలో ఆధునికతకు నిదర్శనం.

