- Home
- Entertainment
- Salman Khan: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన.. సల్మాన్ ఖాన్ సపోర్ట్, అసలేం అన్నారంటే?
Salman Khan: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన.. సల్మాన్ ఖాన్ సపోర్ట్, అసలేం అన్నారంటే?
పేపర్ లీక్లకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యార్థులకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సపోర్ట్ ఇచ్చారు. వారి ఉద్యమం శాంతియుతంగా, న్యాయబద్ధంగా ఉందని అన్నారు. విద్యా సంస్కరణలు తీసుకురావాలని, రాజకీయ జోక్యం వద్దని కోరారు.

Salman Khan
పరీక్షా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న విద్యార్థులకు సల్మాన్ ఖాన్ సపోర్ట్ గా నిలిచారు. ఈ సమస్యను భారత విద్యా వ్యవస్థకు పెద్ద సవాల్గా ఆయన అభివర్ణించారు. శాంతియుత ప్రదర్శనల ద్వారా విద్యార్థులు తమ గళం వినిపించడాన్ని సోషల్ మీడియా పోస్ట్లో ప్రశంసించారు. దేశ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలన్న వారి సంకల్పం ఈ నిరసనల్లో కనిపిస్తోందని అన్నారు.
It was such a peaceful movement, feel so sad that it had to take a violent turn. My heart goes out to the students and their families who were hurt. Paper leak is a very serious issue, and I am glad to know n see that the kids of our country have come together for a better…
— Salman Khan (@BeingSalmanKhan) July 22, 2026
ఈ ఉద్యమంలో పిల్లలకు అండగా నిలిచిన తల్లిదండ్రులను కూడా ఆయన అభినందించారు. కృషితో విద్యా రంగంలో అర్థవంతమైన సంస్కరణలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు, విద్యా వ్యవస్థ మధ్య చర్చలు
ఏ రాజకీయ సంస్థ పేరు చెప్పకుండానే, ఈ నిరసనను రాజకీయ రణరంగంగా మార్చకుండా, విద్యార్థులు, విద్యపైనే దృష్టి పెట్టాలని సల్మాన్ ఖాన్ నొక్కి చెప్పారు. ఢిల్లీలో మార్చ్ సందర్భంగా జరిగిన హింసపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఈ ఘర్షణల్లో ప్రభావితమైన విద్యార్థులకు, వారి కుటుంబాలకు తన సపోర్ట్ తెలిపారు.
విద్యార్థులు, విద్యా వ్యవస్థ మధ్య చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, పరీక్షా ప్రక్రియపై నమ్మకాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమ నుంచి సపోర్ట్
పరీక్షా సంస్కరణలు కోరుతూ విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి సినీ పరిశ్రమ నుంచి సపోర్ట్ పెరుగుతోంది. సల్మాన్ ప్రకటనతో ఇది మరింత బలపడింది. ఇప్పటికే పలువురు నటీనటులు, ఫిలింమేకర్లు పేపర్ లీక్లకు వ్యతిరేకంగా పారదర్శకత, జవాబుదారీతనం, కఠినమైన భద్రతా చర్యలు కోరుతూ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణల తర్వాత ఈ దేశవ్యాప్త ఉద్యమం ఊపందుకుంది. భవిష్యత్తులో లీక్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభావిత అభ్యర్థులకు నష్టపరిహారం ఇవ్వాలని, పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన 'చలో సంసద్' మార్చ్ ఈ ఉద్యమంలో ఒక కీలక ఘట్టం. పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణలు చెలరేగాయి.

