- Home
- Entertainment
- 170 కోట్ల వ్యూస్ రౌడీ బేబీ కాంబో మళ్లీ కలిసింది, ధనుష్తో మరోసారి జతకట్టిన సాయి పల్లవి!
170 కోట్ల వ్యూస్ రౌడీ బేబీ కాంబో మళ్లీ కలిసింది, ధనుష్తో మరోసారి జతకట్టిన సాయి పల్లవి!
172 కోట్లకు పైగా వ్యూస్ సాధించి.. రికార్డులు బ్రేక్ చేసిన పాట రౌడీ బేబి. ఈసాంగ్ లో అద్భుతమైన డాన్స్ తో ఆకట్టుకున్న ధనుష్, సాయి పల్లవి మళ్లీ జంటగా నటించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది.

రౌడీ బేబీ కాంబో మళ్లీ కలిసింది
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోలలో ధనుష్ ఒకరు. ఈ ఏడాది ఆయన నటిస్తున్న అరడజను సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో ఒకటి D55. 'అమరన్' సినిమా దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి ఈసినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 'అమరన్' లాగే ఇది కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందుతోందని అంటున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ధనుష్ జంటగా ఇద్దరు హీరోయిన్లు..
D55 సినిమాను ధనుష్ వండర్బార్ ఫిలింస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. మొదట D55 సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
సాయి పల్లవి రాకతో పెరిగిపోయిన అంచనాలు..
ఈ నేపథ్యంలో D55 సినిమాలో నటించనున్న మరో హీరోయిన్పై ఈరోజు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో సాయి పల్లవి కూడా హీరోయిన్గా నటిస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. 'అమరన్' సినిమా విజయం తర్వాత రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో సాయి పల్లవి మళ్లీ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
8 ఏళ్ల తర్వాత ధనుష్తో
అలాగే, సాయి పల్లవి దాదాపు 8 ఏళ్ల తర్వాత ధనుష్తో జత కడుతున్నారు. వీరిద్దరూ చివరిసారిగా 'మారి 2' సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమాలో ధనుష్, సాయి పల్లవి పోటీపడి డ్యాన్స్ చేసిన 'రౌడీ బేబీ' పాట యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించిన తమిళ పాటగా రికార్డు సృష్టించింది. ఈసాంగ్ ఇప్పటి వరకూ దాదాపు 172 కోట్లకు పైగా వ్యూస్ ను సాధించింది.

