MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • మీ స్టార్టప్ బిజినెస్ కోసం డబ్బులు కావాలా? రూ.30 లక్షల లోన్ ఇవ్వడానికి కేంద్రం రెడీ

మీ స్టార్టప్ బిజినెస్ కోసం డబ్బులు కావాలా? రూ.30 లక్షల లోన్ ఇవ్వడానికి కేంద్రం రెడీ

చాలా మందికి బిజినెస్ చేయాలని ఉంటుంది. కాని ఫండ్స్ ప్రాబ్లమ్ వల్ల వారి ఐడియాలు ప్రారంభంలోనే ఆగిపోతాయి. అలాంటి యువ పారిశ్రామిక వేత్తలను ఎంకరేజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీమ్ ని అమలు చేస్తోంది. దీని ద్వారా మీరు రూ. 30 లక్షల వరకు పెట్టుబడి రుణాన్ని పొందవచ్చు. ఆ స్కీమ్ గురించి వివరంగా తెలుసుకుందాం రండి.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 29 2024, 08:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఎవరైనా వారి స్టార్టప్ కంపెనీని ప్రారంభించడానికి మూలధనం చాలా అవసరం. వారి ఆలోచన సక్సెస్ అవుతుందని నమ్మకం కలిగితేనే ఎవరైనా స్టార్టప్‌లకు నిధులు ఇస్తారు. ముఖ్యంగా బ్యాంకులైతే ఆస్తులు ష్యూరిటీ పెట్టిన దరఖాస్తుదారులకు మాత్రమే రుణాలు ఇస్తాయి. అయితే వ్యాపార ఆలోచన బాగున్నా ష్యూరిటీ లేకపోతే ఎవరూ లోన్స్ ఇవ్వరు. అలాంటి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(SISFS).. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం ఇది. 2021లో ప్రారంభమైన ఈ పథకం భారతదేశంలోని ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ముఖ్యంగా ఇన్నోవేటివ్ ఆలోచనలను ప్రోత్సహించడానికి ఈ పథకం రూపొందించారు. ఈ పథకం భారతదేశంలో స్టార్టప్ కంపెనీలకు అనుకూలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పునాది వేస్తోంది. అంతేకాకుండా స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ప్రారంభ దశ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
 

35

కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్‌ అమలు కోసం రూ.945 కోట్ల నిధిని సమకూర్చింది. ఈ పథకం ద్వారా భారతదేశం వ్యాప్తంగా ఉన్న అర్హులైన వారికి స్టార్టప్‌లను ప్రారంభించడానికి నిధులు ఇచ్చి సహాయపడుతుంది. 'కాన్సెప్ట్ ప్రూఫ్' నే ఆధారంగా  చేసుకొని పెట్టుబడి అందిస్తారు. అంటే బిజినెస్ ఆలోచన కేంద్ర ప్రభుత్వ కమిటీకి నచ్చి, ఇది కచ్చితంగా వర్కవుట్ అవుతుందని వారికి నమ్మకం కలిగితే చాలు. ఆ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నిధులు ఇస్తారు. 

45

సాధారణంగా కాన్సెప్ట్ ప్రూఫ్, ప్రోటోటైప్ డెవలప్‌మెంట్, ప్రొడక్షన్ పరీక్షలు, మార్కెట్ ఎంట్రీ ఇలాంటి దశల్లో సరైన పెట్టుబడి చేతిలో లేక పారిశ్రామికవేత్తలు వెనక్కు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితిలో వారికి అందించే నిధులు, స్టార్టప్‌ల బూస్టింగ్ కి బాగా ఉపయోగపడతాయి. ఇది ఉపాధి కల్పనకు దారితీస్తుంది.

నిపుణుల సలహా కమిటీ

కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం(DPIIT) ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ ద్వారా నిపుణుల సలహా కమిటీ(EAC) ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అమలు, పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటుంది. ఈ నిపుణుల కమిటీ సీడ్ ఫండ్ కేటాయింపు కోసం ఇంక్యుబేటర్ స్టేజ్ లో ఉన్న స్టార్టప్ లను ఎంపిక చేస్తుంది. వాటి పురోగతిని పర్యవేక్షిస్తుంది. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ లక్ష్యాలను నెరవేర్చడానికి, నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది.
 

55

ఏ స్టార్టప్ లకు నిధులు ఇస్తారు..

సామాజిక ప్రభావం, వ్యర్థాల నిర్వహణ, నీటి నిర్వహణ, విద్య, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, పవర్, సెక్యూరిటీ, అంతరిక్షం, రైల్వే, చమురు, గ్యాస్ వంటి రంగాలలో ఆవిష్కరణ పరిష్కారాలను సృష్టించే స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇస్తారు. 

ఈ స్టార్టప్ కంపెనీ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలోని వేరే ఏ ఇతర పథకం కింద రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆర్థిక సహాయం పొంది ఉండకూడదు. 

కంపెనీల చట్టం-2013, SEBI(ICDR) నిబంధనల ప్రకారం ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడి నిధులు పొందడానికి దరఖాస్తు చేసుకునే సమయంలో స్టార్టప్‌లో భారతీయ ప్రమోటర్ల వాటా కనీసం 51% ఉండాలి. స్టార్టప్ దరఖాస్తుదారుడు పథకం మార్గదర్శకాల ప్రకారం ప్రతి సందర్భంలోనూ గ్రాంట్, లోన్/కన్వర్టిబుల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో సీడ్ సపోర్ట్ పొందవచ్చు. ఈ అర్హతలు ఉంటే సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో ఈ పథకంలో రూ. 30 లక్షల వరకు లోన్ మీరు పొందొచ్చు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Recommended image3
7th vs 8th Pay Commission: 8వ పే కమిషన్‌తో మారనున్న జీతాలు.. మీ చేతికి ఎంత వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved