MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి

PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు ఫ్రీగా 15 వేలు.. ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్.. వెంటనే ఇలా చేయండి

PM Viksit Bharat Rozgar Yojana: ఉద్యోగులకు 15000 ఇచ్చే వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ఆఫర్ పొందడానికి యూఏఎన్ యాక్టివేషన్, డీబీటీ ఎనేబుల్ తప్పనిసరి అని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 09 2026, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
EPFO అదిరిపోయే అప్డేట్: ప్రభుత్వం ఇచ్చే రూ.15000 ఎలా పొందాలో తెలుసా!
Image Credit : chatgpt

EPFO అదిరిపోయే అప్డేట్: ప్రభుత్వం ఇచ్చే రూ.15000 ఎలా పొందాలో తెలుసా!

ప్రైవేట్ రంగంలోకి వచ్చే కొత్త ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో కొత్తగా చేరే యువతను ప్రోత్సహించడానికి, వారికి సామాజిక భద్రత కల్పించడానికి తీసుకొచ్చిన 'ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన' (PMVBRJY) అమలును ఈపీఎఫ్ఓ వేగవంతం చేస్తోంది. అయితే, ఈ పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయం నేరుగా పొందేందుకు ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు పూర్తి చేయాలని ఈపీఎఫ్ఓ తాజాగా ఆదేశించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
PMVBRJY పథకం పూర్తి వివరాలు, ప్రయోజనాలు ఇవే
Image Credit : ChatGPT

PMVBRJY పథకం పూర్తి వివరాలు, ప్రయోజనాలు ఇవే

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఈ పథకం ద్వారా మొదటిసారిగా ఉద్యోగంలో చేరుతున్న ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది రెండు విడతలుగా నేరుగా ఉద్యోగుల అకౌంట్లలో జమ అవుతుంది. ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 మధ్య ఉద్యోగంలో చేరి, అంతకుముందు ఈపీఎఫ్ఓ లేదా మినహాయింపు పొందిన ట్రస్టులలో ఎలాంటి సభ్యత్వం లేని వారు దీనికి పూర్తి అర్హులు. మొదటి విడత నగదు పొందడానికి అదే కంపెనీలో కనీసం 6 నెలల సర్వీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Related Articles

Related image1
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
Related image2
Yash: రామాయణ కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకున్న యష్.. ఎందుకంటే?
36
కంపెనీలకు కూడా భారీగా లబ్ధి
Image Credit : stockPhoto

కంపెనీలకు కూడా భారీగా లబ్ధి

కేవలం ఉద్యోగులకే కాకుండా, కొత్త ఉద్యోగాలు కల్పించే ప్రైవేట్ కంపెనీలకు, సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఊతాన్నిస్తోంది. ప్రతి అదనపు ఉద్యోగికి నెలకు రూ. 3,000 వరకు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తుంది. దీనివల్ల వినూత్నంగా ఎంప్లాయ్‌మెంట్ పెరగడమే కాకుండా, కంపెనీలు కొత్త నియామకాలు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి.

46
మనీ పొందడానికి UAN యాక్టివేషన్ ఎలా చేయాలి?
Image Credit : Gemini AI

మనీ పొందడానికి UAN యాక్టివేషన్ ఎలా చేయాలి?

కేంద్రం నుంచి వచ్చే ప్రోత్సాహక సొమ్ము నేరుగా చేరాలంటే ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలి. ఈపీఎఫ్ఓ పోర్టల్‌ సందర్శించి మొబైల్ నంబర్, వ్యక్తిగత వివరాలను సరి చూసుకోవాలి. ఈపీఎఫ్ఓ ఆమోదించిన యాప్ లేదా సిస్టమ్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేసి డిజిటల్ వెరిఫికేషన్ చేయాలి. దీనివల్ల బయోమెట్రిక్ ప్రక్రియ అత్యంత వేగంగా, సురక్షితంగా జరుగుతుంది.

56
బ్యాంక్ ఖాతాలో డీబీటీ ఎనేబుల్ చేసుకోవడం ముఖ్యం
Image Credit : Asianet News

బ్యాంక్ ఖాతాలో డీబీటీ ఎనేబుల్ చేసుకోవడం ముఖ్యం

ఈ పథకం డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అంటే డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అందువల్ల మీ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్పీసీఐ (NPCI) మ్యాపింగ్ జరిగి, డీబీటీ ఫీచర్ యాక్టివ్‌గా ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోవాలి. డీబీటీ లేకపోతే ప్రభుత్వం పంపే డబ్బు ఖాతాలో పడదు. కాబట్టి ఆలస్యం చేయకుండా బ్యాంకుకు వెళ్లి ఈ సదుపాయాన్ని యాక్టివేట్ చేయించుకోండి.

66
వికసిత్ భారత్ దిశగా కీలక అడుగు
Image Credit : Getty

వికసిత్ భారత్ దిశగా కీలక అడుగు

దేశంలో ఉపాధి అవకాశాలను విపరీతంగా పెంచడం, యువత పని నైపుణ్యాలను మెరుగుపరచడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. బడ్జెట్‌లో ప్రకటించిన ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ లో భాగంగా రూపొందించిన ఈ విధానం కొత్త నిరుద్యోగులకు కొండంత అండగా నిలుస్తోంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే తమ యూఏఎన్ అకౌంట్‌ను డిజిటల్ పద్ధతిలో యాక్టివేట్ చేసుకుని లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ఉద్యోగాలు, కెరీర్
ప్రభుత్వ పథకాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
Recommended image2
Yash: రామాయణ కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకున్న యష్.. ఎందుకంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved