315 అడుగుల లోతులో బోటు: ఎన్డీఆర్ఎఫ్
తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం కచలూరు మధ్య మునిగిన బోటును గుర్తించినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రకటించారు
దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచలూరు వద్ద బోటు మునిగిపోయింది. బోటు 315 అడుగుల లోతులో ఉందని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. బోటులోనే చాలా మంది చిక్కుకొన్నారని తాము భావిస్తున్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందం చెబుతోందని ఓ తెలుగు న్యూస్ మీడియా ఛానెల్ ప్రకటించింది.
ఆదివారం నాడు పాపికొండలు వెళ్తున్న రాయల్ వశిష్ట పున్నమి బోటు కచలూరు వద్ద మునిగిపోయింది. ఈ ఘటనలో 41 మంది ఆచూకీ గల్లంతైంది. వీరి ఆచూకీ కోసం బాధితుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
బాధితుల కుటుంబసభ్యులు రాజమండ్రికి చేరుకొంటున్నారు. మరో వైపు ఆదివారం సాయంత్రం నుండి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నేవీ హెలికాప్టర్లు కూడ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం జగన్ సోమవారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించారు.
పాపికొండలు చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. బోటు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోటు యజమాని వెంకటరమణ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు
బోటు ప్రమాదం: తెలంగాణ వాసులను పరామర్శించిన ఎర్రబెల్లి
బోటు మునక: రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు జగన్ పరామర్శ
బోటు మునక: సీఎం జగన్ ఏరియల్ సర్వే
బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని
బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం
మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే
అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు
డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు
పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్
పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం
పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం
బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం
గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..
అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్
బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి
బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు
బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం
బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు
పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత
తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు
పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు
బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం