Asianet News TeluguAsianet News Telugu

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచలూరు సమీపంలో ఆదివారం నాడు బోటు మునిగిన ప్రాంతంలో గతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.

kachaluru:two boats  capsized in this place
Author
Devipatnam, First Published Sep 15, 2019, 3:29 PM IST


రాజమండ్రి: దేవీపట్నం-కచ్చలూరు ప్రాంతంలో రాయల్ పున్నమి బోటు ఆదివారం నాడు బోల్తా పడింది. గతంలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ రెండు ప్రమాదాల్లో కూడ పెద్ద ఎత్తున .ప్రాణ నష్టం చోటు చేసుకొంది.

పాపికొండలను చూసేందుకు 61 మంది ప్రయాణీకులు  రాయల్ పున్నమి బోటులో ఆదివారం నాడు బోటులో ప్రయాణాన్ని ప్రారంభించారు. గండి పోచమ్మ ఆలయం నుండి  కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

కచ్చలూరు ప్రాంతంలో 80 అడుగుల లోతు ఉంటుంది. ఈ ప్రాంతంలో గోదావరి నది సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. 1964లో కచ్చలూరులో ఉదయ్ భాస్కర్ అనే బోటు మునిగింది. ఈ ఘటనలో 60 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ఝాన్సీరాణి అనే బోటు మునిగి 8 మంది మృతి చెందారు. ఈ రెండు ప్రమాదాలు కచ్చలూరులోనే చోటు చేసుకొన్నాయి.

ఆదివారం నాడు కూడ కచ్చలూరు ప్రాంతంలోనే బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం చోటు చేసుకొన్న సమయంలో బోటులో 61 మంది ఉన్నారని సమాచారం. బోటులో లైఫ్ జాకెట్లు వేసుకొన్న వారు బయట పడినట్టుగా సమాచారం..

"

సంబంధిత వార్తలు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

Follow Us:
Download App:
  • android
  • ios