టీఆర్ఎస్ పార్టీలో బాహుబలి ఉన్నారంటూ కేసీఆర్ పదేపదే చెప్తున్నారని అక్కడ బాహుబలి ఉంటే బీజేపీలో మోదీ బ్రహ్మాస్త్రం ఉందంటూ హెచ్చరించారు. ఎంతమంది బాహుబలిలు ఉన్నా తమ బ్రహ్మాస్త్రం ముందు దిగదుడుపేనన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ రేప్, హత్య ఘటనలో నిందితుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశపై అఘాయిత్యానికి పాల్పడక ముందే అనేక ఘోరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
నవంబర్ 27న తోడుంపల్లి వద్ద దిశపై అత్యాచారం చేసి హత్య చేశారు నిందితులు ముహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్, శివ. నిందితులను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం.
విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయంటూ శాసనసభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తన ట్విట్టర్ లో తెలిపారు. అధికారిక వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ కావొచ్చన్న సీఎం నిర్ణయం మంచిదంటూ కొనియాడారు.
అంతటి విశిష్టత కలిగిన అమ్మ ప్రేమకు కలంకం తీసుకువచ్చింది ఓ తల్లి. కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి ముక్కుపచ్చలారని పసికందును కడతేర్చింది. తన ఒడిలో పెట్టుకుని ముద్దాడాల్సిన తల్లి నిర్థాక్షిణ్యంగా బిడ్డపై మమకారం లేకుండా కాలువలో పడేసి ప్రాణాలు తీసింది.
ఏ స్పీకర్ కు సభ్యుడిని సస్పెండ్ చేయాలని ఉండదని, అలా అనుకోరని అయితే అందుకు తాను భిన్నంగా వ్యవహరించానని అందువల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని రగడ చోటు చేసుకుంది. అమరావతిపై చర్చకు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిసార్లు రిక్వస్ట్ చేసిన సభ్యులు వినకపోవడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
ఆనాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశించినట్లుగానే 13 జిల్లాలకు మధ్యన, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తని ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని ఆయన సూచిస్తే ఆయన సూచనలను కూడా పరిగణలోకి తీసుకునే అమరావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఒకవేళ పీవీ నర్సింహారావు ఎక్స్ ప్రెస్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లకు చంద్రబాబు నాయుడే శంకుస్థాపన చేసినట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమా అన్నారు.
అమరావతి అనేది ఒక చరిత్ర అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అందర్నీ సంప్రదించిన తర్వాతే రాజధానిని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనుకూలంగా ఉండేలా అమరావతిని నిర్మించిననున్నట్లు తెలిపారు.