తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం ప్రజలందరిలో ఏర్పడిందన్నారు. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయమన్నారు మెగాస్టార్ చిరంజీవి.
గజ్వేల నియోజకవర్గం తన నియోజకవర్గమని అయితే తాను ఎక్కడ మునుగుతున్నానో ఎక్కడ తేలుతానో తెలియదన్నారు. తన నియోజకవర్గం ప్రజలను కలిసేందుకే సమయం దొరకడం లేదని అందువల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు.
వ్యాధి లేని వ్యక్తికి ఆపరేషన్ చేయడం ఎంత నేరమో కేంద్రం చేయనున్న చట్టం కూడా అంతే నేరమని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఇకపోతే వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపటూర్ సమత కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశపై రేప్, హత్య ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్ జడ్జితో విచారించేందుకు సుప్రీం కోర్టు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
జనవరి నెలాఖరుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి గజ్వేల్ వరకు నీళ్లు తీసుకువస్తామన్నారు. కాల్వలు తవ్వి పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని తెలిపారు. మిడ్ మానేరు ప్రాంతం వరకు నీరందుతుందని చెప్పుకొచ్చారు. జనవరిలో కాళేశ్వరం నీరును చూసి ప్రతీ ఒక్కరూ సంతోషపడాలన్నదే తన తక్షణ కర్తవ్యమని చెప్పుకొచ్చారు కేసీఆర్.
రాజకీయ నాయకులు రిలాక్స్ అనే పదానికి దూరంగా ఉంటూ నిరంతరం ప్రజాసేవకే అంకితం కావాలని సూచించారు తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్. పైరవీలు, పార్టీలకు అతీతంగా పరిపాలన అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు కేసీఆర్.
రాయలసీమ ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం జగన్ అద్భుతంగా మాట్లాడారంటూ కితాబిచ్చారు. జగన్ హయాంలో తాత రాజారెడ్డి పాలన కొనసాగుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నారా లోకేష్ ను టార్గెట్ చేశారు ఎమ్మెల్యే రోజా. అయితే తాజాగా సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే రోజా నెక్స్ట్ టార్గెట్ బాలయ్యేనని అర్థమవుతుంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని సీఎం వైయస్ జగన్ తోపాటు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించారని ఆరోపిస్తోంది టీడీపీ.