చంద్రబాబు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కట్టలేకపోయాడని అలాంటి వ్యక్తి ఐదు సంవత్సరాలలో పెద్ద నగరాన్ని నిర్మిస్తానని చెప్పడం విడ్డూరం కాకపోతే ఇంకేంటని నిలదీశారు. ఆ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ను కూడా తామే పూర్తి చేయబోతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమస్యలపై ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ని నిలిపితే ఆయన రోడ్డుపై నిరసన తెలియచేసే పరిస్దితికి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ను వెళ్లనీయాలంటూ వైఎస్ కాంగ్రెస్ నేతలకు చెప్పారని గుర్తు చేశారు.
ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు విద్యాభ్యాసం పూర్తైన తర్వాత జర్నలిస్ట్ గా పనిచేశారు. జర్నలిజంలో విలేకరిగా మెుదలైన ఆయన ప్రస్తానం సంపాదకుడు వరకు వెళ్లింది. అనంతరం రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతగా మారారు.
1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. మారుతీరావు స్క్రీన్ ప్లే అందించిన ఆ చిత్రం విజయవంతం అయ్యింది. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో ఆనాటి నుంచి వెనుతిరగలేదు.
చంద్రబాబుకు మానవత్వం లేదన్న విషయం మన అందరికీ తెలిసిందేనని ఆయన చేసిన వ్యాఖ్యలను పైన ఉన్న దేవుడు చూసుకుంటాడని అయితే సభను ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు సీఎం జగన్.
వైయస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. వివేకా హత్యపై ఆనాడు జగన్ సీబీఐ విచారణ కోరిన సంగతిని గుర్తు చేశారు.
వైయస్ చనిపోవడంతో రాష్ట్రానికి ఆయనే దిక్కు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తానొక్కడినే నాయుకుడిని అన్నట్లు గా చంద్రబాబు నాయుడు ఫీలవుతున్నారంటూ సెటైర్లు వేశారు.
చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మగధీర సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుందని చెప్పుకొచ్చారు. 151 మందికి తానొక్కడినే సమాధానం చెప్తానంటూ చంద్రబాబు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రోజా.
ఒక తీవ్రవాదిని కొట్టినట్లు తనను ఐదేళ్లు పోలీసులు కొట్టారని గుర్తు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తాను ఐదేళ్లు బతుకుతానో లేదో అన్న పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ గడిపానని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కళ్లకు, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని అసెంబ్లీ వద్ద చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపే మీడియాకు ప్రభుత్వం సంకెళ్లు వేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.