దొంగ పనులు చేసి దొరికిపోయి చిప్పకూడు తిన్నా బడాయి మాటలు మాట్లాడతాడు చిట్టి రెడ్డి అంటూ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై కూడా సెటైర్లు వేశారు బుద్ధా వెంకన్న. జగన్ జైల్లో ఉన్న ఆ చరిత్ర మర్చిపోయారా అంటూ విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు.
సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు లెక్కలు చెప్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి సభలో ఆరోపించారు.
ఇకపోతే తన నియోజకవర్గం విషయానికి వస్తే ఇప్పటి వరకు రాజోలు నియోజకవర్గానికి అవినీతి మచ్చ ఏర్పడలేదని చెప్పుకొచ్చారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నియోజకవర్గాన్ని మెుత్తం అవినీతిమయం చేశారని ఆరోపించారు.
అనంతరం బాలాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు కేసీఆర్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జగన్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను డైవర్ట్ చేసిందని మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రానికి లేఖలు రాశారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
సభలో సభ్యతగా కూర్చుంటున్న ఎమ్మెల్యేలు ఏమైనా పనికిమాలిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ్మినేని సీతారాం. టీడీపీ ఎమ్మెల్యేలే తెలివైన వారు, ప్రజాసమస్యలపై పోరాడేవారని అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని.
దిశ యాక్ట్ అనేది అసెంబ్లీలో తన నుంచే ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కోరారు. ఒక మహిళా ఎమ్మెల్యేనైన తననే ఇంతలా వేధిస్తే ఒక సాధారణ మహిళ పరిస్థితి ఏంటని అసెంబ్లీలో వాపోయారు.
కేంద్రం విడుదల చేసిన నిధులు పక్కదారి పట్టించారా అంటూ నిలదీశారు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లను, సర్పంచ్ లను ఇబ్బంది పెట్టాలనో తెలియదు గానీ వారికి బిల్లులు చెల్లించడం లేదని వాపోతున్నారని తెలిపారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని కార్పొరేషన్లను చంద్రబాబు సన్నిహితులకే కట్టబెట్టారని ఆరోపించారు. చివరికి దేవాలయాల్లో క్లీనింగ్ చేసే దానికి కాంట్రాక్ట్ ను కూడా చంద్రబాబునాయుడుకు సమీప బంధువు అయిన భాస్కర్ నాయుడుకు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు.
ఎన్ కౌంటర్ అనంతరం కాస్త మౌనంగా ఉన్న సీపీ సజ్జనార్ ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అందులో భాగంగానే కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.