దేశంలో అత్యంత చెత్త ఇంగ్లీషు మాట్లాడేది చంద్రబాబు తప్ప ఇంకెవరు అంటూ కేటీఆర్ అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. కనీసం ఇంగ్లీషు కూడా మాట్లాడలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని అలాంటి పరిస్థితి ఇకపై ఎవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టారంటూ చెప్పుకొచ్చారు చెవిరెడ్డి.
కళ్యాణ్ వ్యాఖ్యలకు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కౌంటర్ ఇచ్చినట్లు కామెంట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇంగ్లీషు బోధనపై ప్రభుత్వ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో అనేక కార్పొరేషన్ లకు చైర్మన్ల నియామకం జరిగిందన్నారు సీఎం జగన్. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా, ఏపీ ఐఐసీ చైర్మన్ గా ఆర్ కే రోజా, ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గా నందమూరి లక్ష్మీ పార్వతిలను నియమించామని చెప్పుకొచ్చారు.
అధికారం కోల్పోయామన్న నిరాశ, నిస్పృహలతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. ఇలాగే చంద్రబాబు వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో 23 సీట్లు కూడా రావని హెచ్చరించారు అనిల్ కుమార్ యాదవ్.
చంద్రబాబు లాంటి వ్యక్తులను చాలా మందిని చూశామని చెప్పుకొచ్చారు. స్పీకర్ ను కూడా గౌరవించుకోలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ విరుచుకుపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రతిపక్ష నేతగా ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
త్వరలోనే ఇదేతరహా రాజకీయాన్ని నెరపేందుకు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు రంగం సిద్ధం చేస్తున్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అమెరికా నుంచి తిరుగుటపాలా వచ్చేసిన జగన్ తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాడి ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు నాయుడుకు 70 ఏళ్లు దాటాయని ఆయన హుందాగా నడుచుకోవాలని అంబటి రాంబాబు సూచించారు.
చంద్రబాబు నాయుడుకు చిన్నమెుదడు చితికిపోయిందని రోజా విమర్శించారు. చంద్రబాబును ఆస్పత్రిలో చూపించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వల్ల అసెంబ్లీలో సమయం వృథా తప్ప ఏమీ లేదని రోజా విమర్శించారు.
మైండ్ గేమ్ ఆడటంలో జగన్ ఎక్స్ పెర్ట్ అంటూ చంద్రబాబు ఆరోపించారు. ఎవరితో మైండ్ ఆడతారంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే వర్షాలు పడవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీలో రైతు భరోసా పథకంపై చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబుపై సెటైర్లు వేశారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు ఎన్నిసార్లు చెప్పినా వినడని ఆయన ఎప్పుడూ కుక్కతోక వంకరే అన్నట్లుగా వ్యవహరిస్తారంటూ విరుచుకుపడ్డారు.