ప్రధాని నరేంద్రమోదీ కేవలం బీజేపీ దాని అనుబంధ పార్టీల సభ్యులకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నారని మిగిలిన వారికి ఇవ్వడం లేదన్నారు. తాము సమస్యలపై కలుద్దామంటే ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి కోసం పలువురు పార్టీ సీనియర్ నేతలు పైరవీలు చేస్తున్నారు. అలాంటి వారిని కాదని ఇటీవలే పార్టీలోకి చేరిన డీకే అరుణకు పట్టం కడతారా అన్న చర్చ కూడా జరుగుతుంది.
పసుపు బోర్డుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ ధర్మపురి అరవింద్. రైతులకు జనవరిలో శుభవార్త వినిపిస్తామని ప్రకటించారు. పసుపు బోర్డును మించిన ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపారు. అరవింద్ గట్టి నెగోషియేటర్ అన్న విషయం నిరూపిస్తాననని చెప్పుకొచ్చారు.
వైసీసీ ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పడంతో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సీఎం వైయస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు శాంతించారు.
10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తాను స్టేట్ ఫోర్త్ ర్యాంకర్ ని అని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు. తనకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గోల్డ్ మెడల్ కూడా అందజేశారని గుర్తు చేశారు.
రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేసి బెయిల్ రానివ్వకుండా వైసీపీ నేతలు ప్రయత్నించినప్పుడు స్వయంగా తానే రంగంలోకి దిగానని గుర్తు చేశారు. తాను రంగంలోకి దిగడంతో వైసీపీ వాళ్లు వెనకడుగు వేశారని చెప్పుకొచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్యకేసుకు సంబంధించి కుట్రకోణాలను బట్టబయలు చేసింది సీబీఐ. కుట్రపూరితంగానే అయేషా మీరా హత్య కేసుకు సంబంధించి కీలక ఆధారాలను నాశనం చేసినట్లు గుర్తించింది.
తనను పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న అచ్చెన్నాయుడును పశువుల ఆస్పత్రిలో చేర్చాలంటూ కౌంటర్ ఇచ్చారు. పశువుల ఆస్పత్రిలో చేర్పిస్తే ఆయన ఆరోగ్యం బాగుంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి కొడాలి నాని.
అసెంబ్లీలో ప్రతీ ఒక్కరూ తనను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపడం తాను చేసిన తప్పా అంటూ నిలదీశారు. ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై మాట్లాడితే దాడికి దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి అచ్చెన్నాయుడు.
ఏపీ దిశచట్టం ఒక నవశకానికి దారి తీస్తోందని వనిత స్పష్టం చేశారు. నేరం జరిగిన తర్వాత అత్యంత వేగంగా దర్యాప్తు, దోషులకు శిక్ష నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు.