ప్రధాన మోడీ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది. కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్కు చెందిన సుఖ్బిర్ సింగ్ సంధులను నియమించింది.
బీజేపీ నేత జితేందర్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిలు వెళ్లారు. మహబూబ్ నగర్ పార్లమెంటు టికెట్ దక్కని జితేందర్ రెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ నుంచి కడియం కావ్య, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్లను అభ్యర్థులుగా వెల్లడించింది.
ఒక వైద్యకవిగా తన అనుభవాల స్పందను రాసుకున్న డా. టి.రాధాకృష్ణమాచార్యులు కవిత ' కొన్ని వైరస్ లు' ఇక్కడ చదవండి :
బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవాల్లో పంచ పరివర్తన్ కార్యక్రమంపై చర్చించనున్నారు. ఈ దసరాతో ఆర్ఎస్ఎస్ నూరేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇందుకోసం ఈ నెలలోనే ప్రతినిధులు సమావేశమై కీలక అంశాలపై చర్చ జరపనున్నారు.
వచ్చే ఏడాది వ్యక్తి కంటే ఏఐ స్మార్ట్గా ఉంటుందని ఎలన్ మస్క్ అంచనా వేశారు. 2029 కల్లా మొత్తం మనుషుల కంబైన్డ్ మేధస్సు కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలివికల్లదవుతుందని ట్వీట్ చేశారు.
టీడీపీ రేపు అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించనుంది. 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. తొలి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం వాయిదా పడింది. అందరితో కలిసి కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ర్యాలీగా వెళ్లాలని ఆయన అనుకున్నారు. కానీ, సెక్యూరిటీ కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. దీంతో చేరిక తేదీ కూడా వాయిదా పడింది. ఈ నెల 15 లేదా 16వ తేదీన తాను ఒక్కడే తాడేపల్లికి వెళ్లి వైసీపీలో చేరుతానని తాజాగా ఓ లేఖలో ముద్రగడ వెల్లడించారు.