ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయంగా పోరాడితే తాను ఈ రోజే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించగలనని అన్నారు. సీబీఐ, ఐటీ సోదాల భయం ఎవరికి ఉన్నా.. వారు తన వద్దకు రావొచ్చని పిలుపు ఇచ్చారు.
తెలుగు దేశం పార్టీకి ఈసీ ఝలక్ ఇచ్చింది. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై అభ్యంతరకర పోస్టులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయరాదని, ఇది వరకే ఉన్న అభ్యంతరకర పోస్టులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై జోస్యం చెప్పారు. పార్టీలో అంతర్గత కలహాలతో ప్రభుత్వం బలహీనమైపోతుందని అన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారెక్కారు. ఎర్రవెల్లి ఫామ్ హౌజ్లో కేసీఆర్ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను స్వాగతించారు. తాను ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ మారుతున్నట్టు అంతకు ముందు మీడియాతో ఆర్ఎస్పీ చెప్పారు.
ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు
వైఎస్ జగన్ ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. 21 రోజులపాటు ఈ యాత్ర సాగే అవకాశం ఉన్నది. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల ప్రచారమే ఉండనుంది.
పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ పాపులర్ డైలాగ్ కొట్టాడు. మీరు కొట్టారు మేం తీసుకున్నాం. మాకు టైం వస్తుంది. మేమూ కొడతాం అంటూ జగన్ చేసిన డైలాగ్ను ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడు.
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ పిటిషన్ ఇచ్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం జగిత్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరనున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ కప్ను రాయల్ చాలెంజర్స్ ఉమెన్ టీమ్ గెలుచుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం జగిత్యాలకు వస్తున్నారు. గీతా విద్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.