గల్ఫ్ టికెట్ ప్రైజ్ మనీ పెంచింది. ఆరు నెంబర్లలో నాలుగు నెంబర్లు మ్యాచ్ అయి గెలిచిన వారి ప్రైజ్ మనీని గణనీయంగా పెంచినట్టు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
రాష్ట్ర క్యాబినెట్ మరోసారి ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేసింది. వీరి పేర్లను గవర్నర్కు పంపాలని తీర్మానించింది.
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి క్యాబినెట్ తీర్మానించినట్టు వెల్లడించింది.
ఎన్నికల బరిలో కోడికత్తి శ్రీను దిగుతున్నారు. ఆయన అమలాపురం స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిసింది.
దళితుడైనందునే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను చిన్న పీట మీద కూర్చోబెట్టారని వస్తున్న విమర్శలపై భట్టి స్పందించారు. తానే కావాలని చిన్నపీట మీద కూర్చున్నానని వివరించారు.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ వేశాడు. తనకు, తన కుటుంబానికి సీఎం జగన్ నుంచి ప్రాణ హాని ఉన్నదని పిటిషన్ దాఖలు చేశాడు.
మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని పునర్నిర్మించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ఆ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలోనే ఆ ఆశ్రమ పాత చిత్రాలు, కొత్త చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
రేపు సాయంత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ కరీంనగర్ నుంచి ప్రచారం మొదలు పెడతారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు.
చంద్రబాబు ఇంటి వద్ద ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హల్ చల్ చేశారు. ఏపీలో పాల్ రావాలని, పాలన మారాలని కామెంట్లు చేశారు. కాపులంతా ప్రజా శాంతి పార్టీలోకి రావాలని అన్నారు.
ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టుపై స్టే విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే.. బాంబే హైకోర్టు తీర్పు సహేతుకంగా ఉన్నదని పేర్కొంటూ మహారాష్ట్ర విజ్ఞప్తిని తిరస్కరించింది.