కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. దక్షిణాఫ్రికా, యూకే, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సహా చాలా దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు వందకు చేరువ అవుతున్నాయి. డెల్టా కంటే వేగంగా వ్యాపించే వేరియంట్ కావడంతో మళ్లీ ప్రయాణాలపై నిషేధం, ఆంక్షలు విధించే అవకాశం ఉన్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఒక్క రోజే ఢిల్లీలో పది ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.