పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు అమలు చేస్తున్నాయి. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు సింగర్లపై ఫోకస్ పెట్టాయి. వీరిని పార్టీలోకి చేర్చుకుని టికెట్లు ఇచ్చి బరిలోకి దింపనున్నారు. ఆప్ ఇప్పటికే పలువురు సింగర్లను అభ్యర్థులుగా ఖరారు చేసింది. స్థానికంగా ప్రజల్లో విశేష ఆదరణ ఉండటం, రైతు ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించి మన్ననలు పొందడంతో వీరికి డిమాండ్ పెరిగింది. ఈ సారి ఓటర్లూ ఎక్కువ మంది యువకులే ఉండటమూ మరో కారణంగా ఉన్నది.