ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందం కుదరకపోతే అది ఆ దేశానికి చాలా నష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గాజాను ధ్వంసం చేస్తున్నట్లు ఇజ్రాయల్ సైన్యం ప్రకటించింది. ఇక దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుపై ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. HCU విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్కు వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశం కోసం సీఎం వెళ్తున్నారు. ఇక నేడు సత్యసాయి జిల్లాలలో జగన్ పర్యటించనున్నారు. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..
11:54 PM (IST) Apr 08
అమెరికాతో అణు ఆయుధాల గురించి మాట్లాడటానికి ఇరాన్ ఒప్పుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని కన్ఫర్మ్ చేశారు, త్వరలోనే చర్చలు మొదలవుతాయి.
పూర్తి కథనం చదవండి11:42 PM (IST) Apr 08
రాజకీయంగా, చట్టపరంగా పెద్ద చర్చలు జరుగుతున్న టైంలో వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తుల రికార్డులన్నీ డిజిటల్లో భద్రపరచాలి. వక్ఫ్ ఆస్తుల వివాదాల పరిష్కారానికి టైమ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు.
పూర్తి కథనం చదవండి11:39 PM (IST) Apr 08
Instagram: ఇన్స్టాగ్రామ్ తీసుకువచ్చిన కొత్త మార్పుల ప్రకారం.. 16 ఏళ్లలోపు టీనేజర్లు తల్లిదండ్రులు అనుమతి ఇవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లైవ్ స్ట్రీమ్ సర్వీసును ఉపయోగించుకోవడానికి అనుమతి ఉండదు. డైరెక్ట్ మెసేజ్లలో అనుమానిత నగ్నత్వం ఉన్న చిత్రాలను బ్లర్ చేసే మా ఫీచర్ను ఆఫ్ చేయడానికి కూడా వారికి అనుమతి అవసరమని మెటా బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. అలాగే, మెటా తన ఫేస్బుక్, మెసెంజర్ ప్లాట్ఫామ్లలో కూడా టీనేజ్ అకౌంట్ల విషయంలో సెక్యూరిటీని మరింత విస్తరిస్తున్నట్టు తెలిపింది.
11:26 PM (IST) Apr 08
మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఇంకా KYC సమర్పించలేదా? RBI మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్ 10వ తేదీలోగా కేవైసి సమర్పించకపోతే ఖాతాలు మూసివేయబడవచ్చు. కాబట్టి వెంటనే సంబంధిత పత్రాలను తీసుకెళ్లి కేవైసి సమర్పించండి.
పూర్తి కథనం చదవండి10:26 PM (IST) Apr 08
IPL LSG vs KKR: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ సూపర్ ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ పై అద్భుతమైన బ్యాటింగ్ తో అజేయ హాఫ్ సెంచరీ సాధించాడు. కోల్ కతా అడ్డాలో లక్నో టీమ్ కు సూపర్ విక్టరీ అందించాడు. ఈ క్రమంలోనే రికార్డుల మోత మోగించాడు.
10:09 PM (IST) Apr 08
ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్దకొడుకు అకీరా నందన్ పుట్టినరోజునేే చిన్నకొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్ లో ఓ సమ్మర్ క్యాంప్ మార్క్ శంకర్ ఉండగా అగ్నిప్రమాదం జరిగింది... దీంతో ఇతడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. పవన్ తో పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తన కొడుకుతో పాటు మిగతా పిల్లలను కాపాడింది ఎవరో పవన్ వెల్లడించారు. వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పూర్తి కథనం చదవండి09:22 PM (IST) Apr 08
Priyansh Arya: పంజాబ్ కింగ్స్ యంగ్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. మథీషా పతిరానా బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లతో వరుసగా 6,6,6,4 బాది 23 పరుగులు రాబట్టాడు. 39 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ నాల్గో సెంచరీ కావడం విశేషం. అతని కంటే ముందు గేల్ (30), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38) మాత్రమే ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీలు సాధించారు. అలాగే, ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన రెండో భారతీయుడిగా ప్రియాంష్ ఆర్య నిలిచాడు.
పూర్తి కథనం చదవండి08:33 PM (IST) Apr 08
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ ఎంటరై అద్భుతాలు చేస్తోంది. ఇప్పటికే వైద్యరంగంలో ఏఐ ప్రవేశించింది... తాజాగా ఈ టెక్నాలజీని ఉపయోగించిన హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ సరికొత్త పరిశోధన చేసింది. ఇలా ఏఐ సాయంతో కిమ్స్ వైద్యులు చేసిన పరిశోధన ఏమిటి? దీని ఫలితం ఎలా ఉంది? భవిష్యత్ వైద్యశాస్త్రంలో ఏఐ గేమ్ ఛేంజర్ గా ఎలా మారుతుంది? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి08:06 PM (IST) Apr 08
IPL LSG vs KKR: నికోలస్ పూరన్ క్రీజులో ఉంటే పూనకాలే అనేలా మరోసారి సూపర్ నాక్ అడాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. రెండు టీమ్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిపించాయి. దీంతో ఐపీఎల్ 2025లో భారీ స్కోర్ మ్యాచ్ గా నిలిచింది.
07:30 PM (IST) Apr 08
KKR vs LSG IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ పరుగుల సునామీ రేపుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో 5 మ్యాచ్ లు ఆడిన నికోలస్ పూరన్ 288 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ ను తనవద్ద ఉంచుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు మూడు హాఫ్ సంచరీలు సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్ 87 పరుగులు నాటౌట్.
పూర్తి కథనం చదవండి06:56 PM (IST) Apr 08
భారతీయ పారిశ్రామికవేత్త శృతి చతుర్వేదిని అమెరికా విమానాశ్రయంలో 8 గంటలపాటు నిర్బంధించి అవమానించారు. పవర్ బ్యాంక్ సాకుతో ఎఫ్బీఐ అధికారులు వేధించారని ఆరోపించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
పూర్తి కథనం చదవండి06:41 PM (IST) Apr 08
మనం బందువులు, స్నేహితులు లేదా తెలిసినవారి ఇంట శుభకార్యానికి వెళ్ళినప్పుడు డబ్బులు చదివిస్తుంటాం. అయితే రూ.100, 500, 1000 ఇలా కాకుండా రూ.116, 516, 1116 చదివిస్తాం. ఇలా ఎందుకు చేస్తామో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రూ.116 సాంప్రదాయం ఎప్పుడు మొదలయ్యింది? ఎందుకు మొదలయ్యింది? అనేది ఇక్కడ తెలుసుకుందాం. దీని వెనక ఆసక్తికర స్టోరీ ఉంది.
పూర్తి కథనం చదవండి06:02 PM (IST) Apr 08
pawan kalyan vs ys jagan: సింగపూర్లోని ఇంటర్నేషనల్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో అక్కడ చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ ప్రత్యేక విమానంలో వైజాగ్ నుంచి సింగపూర్ బయలుదేరారు. ఈ నేపథ్యంలో పవన్ కుమారుడు కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ప్రముఖులు, రాజకీయ నేతలు కోరుకుంటున్నారు. అయితే పవన్ పేరు ఎత్తగానే ఉవ్వెత్తున ఎగసిపడే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతలు పవన్ కుమారుడు కోలుకోవాలని సోషల్మీడియాలో పోస్టులు పెట్టారు. అవి చూసిన క్యాడర్ ఏమనుకుంటుందంటే...
పూర్తి కథనం చదవండి05:53 PM (IST) Apr 08
KKR vs LSG IPL 2025: ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 238/3 పరుగులతో ఐపీఎల్ లో తమ రెండో అత్యధిక స్కోర్ ను నమోదుచేసింది. ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ లు అద్భుతమైన బ్యాటింగ్ లో పరుగుల వరద పారించారు. వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదారు. దీంతో లక్నో టీమ్ కేకేఆర్ ముందు 239 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.
05:49 PM (IST) Apr 08
Indoor Plants: వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ టైంలో నిరంతరం ఏసీలు పనిచేస్తుంటే కరెంట్ బిల్లు రూ.వేలల్లో వస్తుంది. అలాకాకుండా మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే ఆటోమేటిక్ గా మీ ఇల్లు చల్లగా ఉంటుంది. ప్రత్యేకమైన ఆ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి05:44 PM (IST) Apr 08
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకురావడంలో ముందు వరుసలో ఉంటుంది వాట్సాప్. ముఖ్యంగా యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇంతకీ ఏంటీ ఫీచర్.? దీని ఉపయోగం ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
05:07 PM (IST) Apr 08
Bhuvneshwar Kumar: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలర్ భువనేశ్వర్ కుమార్ కీలకమైన సమయంలో తిలక్ వర్మ వికెట్ ను తీసుకుని మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అలాగే, డ్వేన్ బ్రాబో, లసిత్ మలింగ్ రికార్డులను బద్దలు కొట్టి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు.
04:59 PM (IST) Apr 08
లక్షల సాలరీతో ఎయిర్పోర్ట్ లో పనిచేసే అద్భుత అవకాశం. సరైన విద్యార్హతలు, వయసు ఉంటే ఆ ఉద్యోగం మీ సొంతమే కావచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు మీకోసం...
పూర్తి కథనం చదవండి04:26 PM (IST) Apr 08
ఒకప్పుడు ఊరిలో ఒక ఫోన్ ఉందంటేనే గొప్పగా భావించే వారు. ఆ తర్వాత వీధికో ఫోన్ వచ్చేసింది, అనంతరం ఇంటికో ఫోన్ వచ్చేసింది. ఇక ఎప్పుడైతే మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయో ఒక్కొక్కరు రెండేసి ఫోన్లను ఉపయోగించే రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే మీ ఫోన్ నెంబర్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? 10 అంకేలే ఎందుకు ఉంటాయి.? వీటి అర్థం ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
04:22 PM (IST) Apr 08
MEGA VS ALLU: మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య గ్యాప్ ఉన్నట్లు గతంలో అనే సందర్భాల్లో స్పష్టంగా అర్థమైంది. పుష్ప-2 సినిమా విడుదల సమయంలో విభేదాలు దాదాపు బహిర్గతం అయ్యాయి. కానీ బన్నీ అరెస్ట్తో తిరిగి మెగాస్టార్ చిరంజీవి అర్జున్ ఇంటికి వెళ్లడం, ఆ తర్వాత బన్నీ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు సర్దుమనిగాయని అందరూ భావించారు. కానీ అది జరగలేదనన్నది స్పష్టంగా ఈరోజు తెలిసిపోయింది. అర్జున్ పుట్టినరోజున మెగా కుటుంబం ఏం చేసిందో తెలుసా..
04:01 PM (IST) Apr 08
Mahindra: భారతదేశ దిగ్గజ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తన కొత్త డిజైన్ స్టూడియోను అధికారికంగా ప్రారంభించింది. దీని ద్వారా ముఖ్యంగా మహీంద్రా కంపెనీ నుంచి మరిన్ని కొత్త మోడల్స్, బెస్ట్ అవుట్పుట్తో వస్తాయని కంపెనీ ప్రకటించింది. కొత్త డిజైన్ స్టూడియో ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి03:03 PM (IST) Apr 08
ఆకాశంలో పక్షులు విహరిస్తుంటే చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల పక్షులు 'V' ఆకారంలో ఎగరడం గమనించే ఉంటాం. అయితే పక్షులు ఇదే ప్యాటరన్లో ఎగరడానికి ఒక కారణం ఉందని మీకు తెలుసా.? ఇంతకీ పక్షులు ఇలా ఎగరడానికి అసలు కారణం ఏంటి.? దీనివెనకాల ఉన్న సైంటిఫిక్ లాజిక్ ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి02:44 PM (IST) Apr 08
Rajiv Yuva Vikasam: ఈ రోజుల్లో జాబ్స్ కంటే సొంత వ్యాపారం చేసుకోవడం చాలా మంచిది. అందుకే ప్రభుత్వాలు ప్రజలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా అనేక పథకాల అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు 100% సబ్సిడీతో 50,000 రుణం ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చాయి. ఈ రుణం పొందాలంటే ఎలాంటి అర్హతలు కావాలి? ఎవరికి ఈ రుణం ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
02:06 PM (IST) Apr 08
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్స్ నిర్ణయాల తర్వాత ఆ దేశ మార్కెట్ తో సహా ప్రచంచ మార్కెట్ కుదేలయ్యింది. మదుపర్ల సంపద ఆవిరవుతోంది. ఈ క్రమంలో ఓ నాలుగు రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు సేఫ్ అని... ఎప్పటికైనా లాభాలు తెచ్చిపెడతాయని మార్కెటె నిపుణులు చెబుతున్నారు. ఆ రంగాలేమిటో తెలుసా?
పూర్తి కథనం చదవండి
01:48 PM (IST) Apr 08
ICON STAR ALLU ARJUN: పుష్పరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. పుష్ప-2 ద రూల్లో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన బన్నీ.. అతపే తదుపరి నటించబోతున్న సినిమాకు సంబంధించి వీడియోను ఆ చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. రీసెంట్గా అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు కూడా ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ముందు చెప్పినట్లుగానే ఆ సర్ప్రైజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ గర్వపడేలా కాదు.. ఇండియన్ సినిమా గర్వపడేలా సినిమా ఉండబోతున్నట్లు విడుదల చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఐకాన్ స్టార్ తర్వాత చిత్రం విశేషాలు తెలుసుకుందామా!!!
పూర్తి కథనం చదవండి01:25 PM (IST) Apr 08
పరిసరాల పరిశుభ్రత.. చిన్న తనం నుంచి దీని ప్రాముఖ్యత గురించి వివరిస్తుంటారు. మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ప్రభుత్వాలు సైతం స్వచ్ఛత వైపు అడుగులు వేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం సైతం స్వచ్ఛ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. అయితే భారత దేశంలో అత్యంత పరిశుభ్రంగా ఉండే నగరం ఏదో ఎప్పుడైనా ఆలోచించారా.? ఒకటి కాదు రెండు ఏకంగా 8 ఏళ్లుగా ఈ నగరమే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఏంటా నగరం.? ఎలా సాధ్యమైంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
12:25 PM (IST) Apr 08
Pawan kalyan: సినిమాలు చేయడంలో డైలాగులు చెప్పడంలోనే కాదు.. రాజకీయాల్లో కూడా తనకంటూ ఓ లెక్కుందని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రూవ్ చేస్తున్నారు. సింగపూర్లో చదువుకుంటున్న తన చిన్న కుమారుడికి అగ్నిప్రమాదం బారిన పడి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సాధారణంగా ఈ విషయం తెలుసుకున్న వెంటనే పవన్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన అలా చేయలేదు. మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్ ఇచ్చిన మాట కోసం నిలబడిపోయారు. దీనిపై మంత్రి నారా లోకేష్, గిరిజనులు, జనసేన నాయకులు ఏమంటున్నారో తెలుసా?
12:09 PM (IST) Apr 08
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్ట్ కీలక తీర్పును వెల్లడించింది. పేలుళ్లకు కారణమైన ఐదుగురు దోషులకు ఉరిశిక్ష వేయడమే సరైన నిర్ణయమని హైకోర్ట్ అభిప్రాయపడింది. ఇది వరకే NIA కోర్టు వెల్లడించిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టులో సవాల్ చేయగా వాదనలు విన్న అనంతరం తెలంగాణ హైకోర్ట్ కూడా ఉరి శిక్షవేయడమే సరైన నిర్ణయమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
11:52 AM (IST) Apr 08
గుజరాత్ సర్కార్ స్వదేశీ స్టెంట్ తయారీదారులపై ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. దీనివల్ల మేక్ ఇన్ ఇండియాకు సపోర్ట్ దొరుకుతుంది, స్టెంట్ ధరలు తగ్గి పేషెంట్లకు లాభం చేకూరుతుంది.
పూర్తి కథనం చదవండి10:00 AM (IST) Apr 08
Top 7 Seater Cars: పెద్ద ఫ్యామిలీనా? 7 సీటర్ కారు కొనేందుకు ప్రయత్నిస్తున్నారా? అయితే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న నాలుగు 7 సీటర్ కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సమాచారం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓసారి పరిశీలించండి.
పూర్తి కథనం చదవండి09:39 AM (IST) Apr 08
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది. తులం బంగారం ధర రూ. లక్ష దాటడం ఖాయమని అంతా భావించారు. అందుకు అనుగుణంగా పసిడి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. అయితే తాజాగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఈ తగ్గుదుల ఇంకా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే తులం బంగారం ధర రూ. 55 వేలకు చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ బంగారం ఇంతలా తగ్గుముఖం పట్టడానికి కారణం ఏంటి.? నిపుణులు ఏమంటున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం..