హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. గతంలో కోదాడ అసెంబ్లీలో ఈ నియోజకవర్గం ఉంది. 2009 నుండి 2018 వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. 2019 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధించారు.
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో TRS ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్ లో సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభ శనివారం జరగనుంది. ఈ సభ కోసం రహదారి పై దారిపొడవున భారీ స్వాగతతోరణాలు ఏర్పాటు చేశారు.
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి అన్ని మండలాల్లో భారీ మెజారిటీని సాధించారు. కాంగ్రెస్ పార్టీకి ఏ మండలంలో కూడ మెజారిటీ రాలేదు. హుజూర్నగర్ పట్టణంలోని 2018 పోలింగ్ బూత్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతికి మెజారిటీ వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో హుజూర్నగర్ అసెంబ్లీ స్థానంలో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి మాత్రం 69 వేల ఓట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట బద్దలైంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి విజయం సాధించాడు. సానుభూతితో పాటు టీఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని గెలుచుకోవాలనే వ్యూహాంతో ముందుకు సాగడం కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉణ్నారు.
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ విజయంతో వరంగల్ టిఆర్ఎస్ పార్టీ స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకుంది. ఈ సంబరాల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినాయభాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పద్మావతిపై దూసుకుపోతూ కొత్త రికార్డు సృష్టించాడు, గత ఏడు ఎన్నికల్లో విజేతకు వచ్చిన మెజారిటీని 15వ రౌండులో బద్దలుకొట్టాడు.
హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి ఓటమికి కోదాడ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలైన కేసు కూడ కారణమనే అభిప్రాయం కూడ లేకపోలేదు.
టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఆంధ్ర వ్యక్తి అంటూ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నివాదం చెల్లుబాటు కాలేదు. స్థానిక సంస్థల్లో సైదిరెడ్డి బంధువుర్గం విజయాలు టీఆర్ఎస్ కు కలిసి వచ్చాయి.
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి ఓటమి పాలు కావడానికి పలు కారణాలను రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి గ్రూపు తగాదాలతో పాటు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపిస్తే ఏం ప్రయోజనమనే అభిప్రాయం కూడ టీఆర్ఎస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.