#Huzurnagar result: రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి
హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పద్మావతిపై దూసుకుపోతూ కొత్త రికార్డు సృష్టించాడు, గత ఏడు ఎన్నికల్లో విజేతకు వచ్చిన మెజారిటీని 15వ రౌండులో బద్దలుకొట్టాడు.
హుజూర్ నగర్: హుజూర్ నగర్ శానససభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించడం ద్వారా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఏడు సార్లు జరిగిన హుజుర్ నగర్ నియోజకవర్గ ఫలితాల్లో అత్యధిక మెజారిటీని 2009 ఎన్నికల్లో 29194 .ఇదే అత్యధిక మెజారిటీ గా నమోదు అయింది.
ఆ రికార్డును సైదిరెడ్డి 15 వ రౌండ్ లొనే అధిగమించారు. 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి సైదిరెడ్డి మెజారిటీ 32 వేలు దాటింది. ప్రతి రౌండులోనూ సైదిరెడ్డి మెజారిటీ సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఏ రౌండులోనూ కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి సైదిరెడ్డి దరిదాపుల్లోకి రాలేదు. మఠంపల్లి మండలంలో సైదిరెడ్డికి 4607 ఓట్ల మెజారిటీ వచ్చింది.
మొదటి రౌండ్
టిఆర్ఎస్ -5583
కాంగ్రెస్-3107
బిజెపి-128
టిడిపి-113
టిఆర్ఎస్ లీడ్- 2476
రెండవ రౌండ్
టిఆర్ఎస్ -4723
కాంగ్రెస్-2851
బిజెపి-170
టిడిపి-69
టిఆర్ఎస్ లీడ్- 1872
రెండవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-4348
మూడవ రౌండ్
టిఆర్ఎస్ -5089
కాంగ్రెస్-2540
బిజెపి-114
టిడిపి-86
టిఆర్ఎస్ లీడ్- 2549
మూడవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-6897
నాల్గవ రౌండ్
టిఆర్ఎస్ -5144
కాంగ్రెస్-3961
బిజెపి-102
టిడిపి-127
టిఆర్ఎస్ లీడ్- 1183
నాల్గవ రౌండ్ ముగిసే సరికి టిఆర్ఎస్ లీడ్-8080
మట్టంపల్లి మండలం
మొత్తం ఓట్లు :-34855
పోలైన ఓట్లు:-30076
మండలంలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
1)శానంపూడి సైదిరెడ్డి(టీఆరెస్)-16210
2)నలమాద పద్మావతి(కాంగ్రెస్)-11603 3)చావకిరణ్మయి(టీడీపి)-141 4)కోటారామారావు(బీజేపీ)-189
మట్టంపల్లి మండలం టిఆర్ఎస్ మెజారిటీ:-4607
మేళ్లచెరువు మండలం
మొత్తం ఓట్లు :-31270
పోలైన ఓట్లు:-26103
మండలంలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
1)శానంపూడి సైదిరెడ్డి(టీఆరెస్)-14869
2)నలమాద పద్మావతి(కాంగ్రెస్)-8239 3)చావకిరణ్మయి(టీడీపి)-333 4)కోటారామారావు(బీజేపీ)-306
మేళ్లచెరువు మండలం టిఆర్ఎస్ మెజారిటీ:-6630