ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవాలని ఆయన ప్రధానిని విజ్ఞప్తి చేశారు. 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు ప్రస్తావించారు.