విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంట లో విషాదం చోటుచేసుకుంది ఇంటిపై కొండచరియలు విరిగి పడటంతో ఓ మహిళ మృతి చెందింది. పెందుర్తి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గోడ కూలిపోయింది. ఈదురుగాలులకు అక్కిరెడ్డిపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రెండు తాటి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షాలకు దుర్గానగర్ నాయుడు తోట ప్రాంతాలు నీటమునిగాయి.