బిపర్జోయ్ తుఫాన్ మరికొన్ని గంటల్లో గుజరాత్ తీరం దాటనుంది. తీర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తీర జిల్లాల నుంచి సుమారు ఒక లక్ష మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ను ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫోర్స్, రోడ్లు, భవనాల శాఖ, విద్యుత్ శాఖలకు చెందిన బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వైమానిక, నావికా దళం, ఆర్మీతోపాటు కోస్ట్ గార్డు సిబ్బందిగా సిద్దంగా ఉన్నట్టు కేంద్ర రక్షణ శాఖ వెల్లడించింది.