గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుఫాను మధ్య అరేబియా తీర ప్రాంతాలవైపు దూసుకొస్తోంది. ఆ తరువాత అది తీవ్ర తుఫానుగా మారి పాకిస్తాన్ లో మాక్రన్ తీర ప్రాంతాన్ని తాకుతుంది.