తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి సమావేశం మంగళవారం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. క్షురకులుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి నెలకు రూ.20 వేల కనీసం వేతనం, పెద్ద జీయర్ మఠానికి ప్రతి ఏటా రూ.60 లక్షలు, చిన్న జీయర్ మఠానికి రూ.40 లక్షల అదనపు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించింది.