Asianet News TeluguAsianet News Telugu

జియో కంటే ఎయిర్‌టెల్‌ టాప్.... దేశవ్యాప్తంగా తొలిసారిగా...

భారతదేశంలో వై-ఫై లైవ్ కాల్స్ ప్రకటించిన టెలికం ప్రొవైడర్ సంస్థ భారతీ ఎయిర్ టెల్. ఎయిర్ టెల్ వై-ఫై కాలింగ్ చేసుకున్నందుకు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎయిర్ టెల్ వై-ఫై కాలింగ్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పేర్లు నమోదు చేసుకున్న ఖాతాదారుల సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటేసింది.

Airtel says WiFi calling feature crossed 1 million users
Author
Hyderabad, First Published Jan 11, 2020, 1:48 PM IST

ముంబై: టెలికాం దిగ్గజం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ ఇటీవల ప్రారంభించిన వై-ఫై కాలింగ్ ఫీచర్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే పది లక్షల మందికి పైగా వినియోగదారులను నమోదు చేసిందని ఎయిర్‌టెల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా తొలిసారిగా వై-ఫై కాలింగ్‌ ఫీచర్‌ తీసుకొచ్చింది తామేనని ఎయిర్‌టెల్ తెలిపింది.

also read టిక్ టాక్ యాప్ వాడుతున్నారా... జాగ్రత్త, లేదంటే అశ్లీల వీడియోలు...?

వినియోగదారులు ఏ వై-ఫైలో నైనా ఈ సేవను ఉపయోగించుకోవచ్చని భారతి ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ తెలిపారు. ముఖ‍్యంగా ప్రధాన ప్రత్యర్థి, రిలయన్స్‌ జియో తమ మొబైల్‌ వినియోగదారులకోసం వైఫై సేవలను ప్రారంభించిన రెండు రోజుల తరువాత ఈ గణాంకాలను విడుదల చేయడం గమనార్హం.  

Airtel says WiFi calling feature crossed 1 million users

కాగా గత ఏడాది డిసెంబర్ నెలలో ఎయిర్‌టెల్‌ తన  ‘వాయిస్‌‌ ఓవర్‌‌‌‌ వైఫై (వీఓవైఫై)’ సేవలను తొలిసారిగా ప్రారంభించింది. ఈ సేవలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. 

also read అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ : స్మార్ట్ ఫోన్లపై క్రేజీ ఆఫర్

16 బ్రాండ్లలో 100కి పైగా స్మార్ట్‌ఫోన్ మోడళ్లు, ప్రస్తుతం ఎయిర్‌టెల్  వైఫై కాలింగ్‌  ఫీచర్‌కు మద్దతునిస్తున్నాయి. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్‌‌ హాట్‌‌స్పాట్‌‌ లేదా ప్రైవేట్‌‌ హోం వైఫై నెట్‌‌వర్క్‌‌కు కనెక్ట్‌‌ చేసుకొని ఏ మొబైల్‌‌ఫోన్‌‌కైనా, ల్యాండ్‌‌లైన్‌‌కైనా కాల్స్‌‌ చేసుకోవచ్చు.  

Follow Us:
Download App:
  • android
  • ios