బయటకొచ్చిన సురేష్ సెల్ఫీ వీడియో ... ఏపీలో నైట్ కర్ఫ్యూ
NATIONAL Jan 10, 2022, 5:00 PM IST
ఆంధ్రప్రదేశ్లో రోజువారి కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.
Andhra Pradesh Jan 10, 2022, 2:22 PM IST
రోజువారీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూ ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని స్థానికులు భయపడుతున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చివరిసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినప్పుడు వలస కార్మికులు అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. స్వగ్రామాలకు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఇంకా తడిగానే ఉన్నాయి. చాలా మంది ఈ ప్రయాణంలో మరణించారు కూడా. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లోని వలస కార్మికులు లాక్డౌన్ విధిస్తారేమోననే భయంతో స్వగ్రామాలకు తరలి వెళ్లిపోతున్నారు.
NATIONAL Jan 9, 2022, 6:15 PM IST
దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అదే సమయంలో మరణాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా భయాందోళనలు తీవ్రమయ్యాయి. గత కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టినట్లే పట్టి థర్డ్వేవ్ రూపంలో దేశంపై పంజా విసురుతోంది. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. మరో వైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో భయాందోళనకు గురి చేస్తుంది. దేశవ్యాప్తంగా అటు కరోనా.. ఇటు ఒమిక్రాన్ కేసుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసుల రావడంతో మహారాష్ట్ర సతమతమవుతోంది.
NATIONAL Jan 8, 2022, 11:17 PM IST
కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభన కారణంగా ఆంధ్రప్రదేశ్ లో Night curfew అమలులోకి వచ్చిందని.. థియేటర్లలో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ అంటూ మెసేజ్ లు వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
Andhra Pradesh Jan 8, 2022, 1:56 PM IST
ఏపీలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్కులు, రెస్టారెంట్స్, థియేటర్స్, మాల్స్ లో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.
Entertainment Jan 8, 2022, 9:40 AM IST
స్కూల్స్, కాలేజీలు మూసివేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 15 వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలను మూసివేయనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
NATIONAL Jan 4, 2022, 11:05 AM IST
Omicron: గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగుచేసిన ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో తన పంజా విసురుతోంది. భారత్ లోనూ ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కేరళ సర్కారు సైతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో పాటు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది.
NATIONAL Dec 27, 2021, 11:41 PM IST
దేశంలో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. ఈ నెల ప్రారంభంలో దేశంలో తొలి రెండు కేసులను గుర్తించగా ఇప్పుడు ఆ సంఖ్య 400కు పైగా చేరుకుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. కరోనాను అదుపులోకి తెచ్చేందుకు కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నాయి. మన దేశంలో ఒమిక్రాన్ కేసుల్లో ఢిల్లీ టాప్లో ఉంది. అందుకే ఆ రాష్ట్రం ఆంక్షలను కఠినతరం చేశాయి. ఇప్పటికే క్రిస్మస్ వేడుకలను అనుమతించలేదు. అలాగే న్యూయర్ వేడుకలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులతో కలిసి ఢిల్లీలో 290 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈరోజు నుంచి ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Coronavirus Dec 27, 2021, 12:38 PM IST
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో..ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. చూస్తుండగానే కేసుల సంఖ్య 600 కు చేరవైంది. భారత్లో ఒక్కరోజులో 156 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.దీంతో ఒమిక్రాన్ కేసులు సంఖ్య 578 కి చేరింది. దేశంలో 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 151 మందికోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
NATIONAL Dec 27, 2021, 12:03 PM IST
10 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూను అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది
NATIONAL Dec 26, 2021, 12:25 PM IST
ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.
Entertainment Dec 25, 2021, 3:25 PM IST
ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది. సౌత్రాఫికాలో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య పరిమితంగా ఉన్నా.. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందని WHO హెచ్చరించింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ విజృంభనను అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు సిద్దమయ్యాయి.
ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించింది. ఈ వైరస్ను తేలిగ్గా తీసుకోవద్దని, అనవసర ప్రయాణాలు, పార్టీలు, ఫంక్షన్లు వాయిదా వేసుకోవాలని కేంద్రం సూచించింది.
NATIONAL Dec 20, 2021, 8:31 PM IST
కొవిడ్ నిబంధనల మేరకు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు రాష్ట్రంలో night curfew కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నామని, అక్టోబరు 31 తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Andhra Pradesh Oct 14, 2021, 7:28 AM IST
గత 24 గంటల్లో అనంతపురంలో029,చిత్తూరులో 263, తూర్పుగోదావరిలో170,గుంటూరులో142,కడపలో 066, కృష్ణాలో131, కర్నూల్ లో008, నెల్లూరులో260, ప్రకాశంలో 087,విశాఖపట్టణంలో 079,శ్రీకాకుళంలో022, విజయనగరంలో 008,పశ్చిమగోదావరిలో 182 కేసులు నమోదయ్యాయి.
Andhra Pradesh Sep 9, 2021, 4:51 PM IST