Asianet News TeluguAsianet News Telugu
88 results for "

Lakhimpur Kheri

"
Lakhimpur Kheri case: Ashish Mishra's bail quashed Should .. Recommended by the Supreme Court CommitteeLakhimpur Kheri case: Ashish Mishra's bail quashed Should .. Recommended by the Supreme Court Committee

Lakhimpur Kheri case : ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేయాలి.. సుప్రీంకోర్టు కమిటీ సిఫార్సు

లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటన కేసులో అశిష్ మిశ్రాకు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీం కోర్టు కమిటీ తెలిపింది.  దీంతో ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ లఖింపూర్ ఖేరీ ఘటన గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

NATIONAL Mar 30, 2022, 1:29 PM IST

Protect witnesses in Lakhimpur Kheri case: Supreme Court directs UP governmentProtect witnesses in Lakhimpur Kheri case: Supreme Court directs UP government

లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులకు రక్షణ క‌ల్పించండి.. యూపీ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ల‌ఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) హింస కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra)కు గత నెలలో బెయిల్ మంజూరు అయ్యింది. అయితే ఈ బెయిల్ ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ పిటిష‌న్ పై బుధ‌వారం సుప్రీంకోర్టులో వాద‌న‌లు కొన‌సాగాయి. 
 

NATIONAL Mar 16, 2022, 12:47 PM IST

22 injured as BJD MLA rams car into crowd in odisha22 injured as BJD MLA rams car into crowd in odisha

ఒడిషాలో మరో లఖీంపూర్ ఖేరీ ఘటన.. జనంపైకి కారును నడిపిన ఎమ్మెల్యే, 20 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరిని పోలిన ఘటనే ఒడిషాలోనూ చోటు చేసుకుంది. బీజేడీ ఎమ్మెల్యే ప్రశాంత్  జగదేవ్ తన ఇంటి వద్దకు చేరున్న వారిపైకి కారును నడిపారు. ఈ  ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

NATIONAL Mar 12, 2022, 6:01 PM IST

UP Assembly Election 2022 : BJP has crossed the magic figure in UPUP Assembly Election 2022 : BJP has crossed the magic figure in UP

UP Assembly Election 2022 : యూపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. మరోసారి యోగినే ముఖ్యమంత్రి..

యూపీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. 212 స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. దీంతో బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. దీంతో మరోసారి యోగి ఆదిత్యానాథ్ మరోసారి సీఎం కావడం తథ్యంగా కనిపిస్తోంది.

NATIONAL Mar 10, 2022, 9:48 AM IST

UP Assembly Election 2022 : BJP leads in Lakhimpur KheriUP Assembly Election 2022 : BJP leads in Lakhimpur Kheri

UP Assembly Election 2022 : లఖింపూర్ ఖేరీలో బీజేపీ ముందంజ..

యూపీలోని లఖింపూర్ ఖేరీలో బీజేపీ ముందంజలో దూసుకుపోతోంది. ఓ సభలో నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా వాహనాలను పోనిచ్చి మారణకాండకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంఘటన తెలిసిందే. 

NATIONAL Mar 10, 2022, 9:11 AM IST

UP Election 2022: 4th phase assembly fight in UP today .. Polling in 59 constituencies in 9 districtsUP Election 2022: 4th phase assembly fight in UP today .. Polling in 59 constituencies in 9 districts

UP Election 2022 : నేడు యూపీలో 4వ ద‌శ అసెంబ్లీ పోరు.. 9 జిల్లాల్లోని 59 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్

నేడు యూపీలో నాలుగో ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో ఫతేపూర్, బందా, పిలిభిత్, హర్దోయ్, ఖేరీ, లక్నో, రాయ్ బరేలీ, సీతాపూర్, ఉన్నావ్ వంటి తొమ్మిది జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 208 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 13,813 పోలింగ్ స్టేషన్లు, 24,580 పోలింగ్ బూత్‌లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముందస్తు జాగ్రత్తలతో ఓటింగ్ జరగనుంది.

NATIONAL Feb 23, 2022, 6:09 AM IST

farmers filed petition in supreme court challenging ashish mishras bail in lakhimpur kheir casefarmers filed petition in supreme court challenging ashish mishras bail in lakhimpur kheir case

సుప్రీంకోర్టులో రైతుల మరో సవాల్.. కేంద్ర మంత్రి కొడుకు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

యూపీలోని లఖింపూర్ ఖేరిలో రైతులపై నుంచి వాహనాలను పోనిచ్చి మారణకాండకు పాల్పడిన కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు అశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనకు అలహాబాద్ హైకోర్టు ఇటవలే బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

NATIONAL Feb 21, 2022, 3:12 PM IST

UP Elections 2022 : The culprits in the Lakhimpur case will be sent to jail - Akhilesh YadavUP Elections 2022 : The culprits in the Lakhimpur case will be sent to jail - Akhilesh Yadav

UP Elections 2022 : ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో నేర‌స్తుల‌ను, వారి ర‌క్ష‌కుల‌ను జైలుకు పంపుతాం - అఖిలేష్ యాదవ్

UP Election News 2022 : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (utharpradesh)లో మూడో ద‌శ ఎన్నిక‌ల నేప‌థ్యంలో స‌మాజ్ వాదీ (samajwadi) పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ (akhilesh yadav) బుధవారం ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ డ‌బుల్ ఇంజ‌న్ ప్ర‌భుత్వం అవినీతి, అన్యాయాన్ని రెట్టింపు చేసిందని ఆరోపించారు. త‌మ పార్టీ యూపీలో అధికారంలోకి వ‌స్తే లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) కేసులో దోషుల‌కు శిక్ష ప‌డేలా చూస్తామ‌ని అన్నారు. పూర్తి స్థాయిలో కేసు కొనసాగిస్తామ‌ని చెప్పారు. 
 

NATIONAL Feb 16, 2022, 11:46 PM IST

Lakhimpur Kheri Case: Union Minister's son Ashish Mishra released on bail in Lakhimpur Kheri caseLakhimpur Kheri Case: Union Minister's son Ashish Mishra released on bail in Lakhimpur Kheri case

Lakhimpur Kheri Case : ల‌ఖింపూర్ ఖేరీ కేసులో బెయిల్ పై విడుద‌లైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ల‌ఖింపూర్ ఖేరి (Lakhimpur kheri) ఘ‌ట‌న‌లో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (central minister ajay mishra) కుమారుడు ఆశిష్ మిశ్రా (ashish mishra) బెయిల్ పై మంగ‌ళ‌వారం బ‌య‌ట‌కు వ‌చ్చారు. లఖింపూర్ ఖేరీలో హింసాత్మక వాగ్వాదం మధ్య నలుగురు రైతులను చంపిన కేసులో ఆశిష్ మిశ్రాను గతేడాది అక్టోబర్‌లో అరెస్టు చేశారు. టికోనియాలో రైతుల ఆందోళన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. 

NATIONAL Feb 15, 2022, 10:44 PM IST

Centre did not fulfil promises to farmers despite PM's word: SKM in Lakhimpur KheriCentre did not fulfil promises to farmers despite PM's word: SKM in Lakhimpur Kheri

Lakhimpur Kheri: ఎంఎస్‌పీ స‌హా ఇత‌ర వాగ్దానాల‌పై మోడీ స‌ర్కారు నిర్ల‌క్ష్యం : రైతు సంఘాలు

Lakhimpur Kheri: రైతు ఉద్య‌మం నేప‌థ్యంలో స్వ‌యంగా ప్ర‌ధాని మోడీ.. పండించిన పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పీ) పై ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ముందుగు సాగ‌డం లేద‌నీ, దీనికి కృషి చేయ‌డం లేద‌ని సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ఆరోపించింది. 
 

NATIONAL Feb 15, 2022, 1:55 PM IST

One who built university in jail, one who killed farmers out on bail: AkhileshOne who built university in jail, one who killed farmers out on bail: Akhilesh

UP Election 2022: వ‌ర్సీటి క‌డితే జైల్లో.. రైతుల‌ను చంపితే బెయిల్‌పై.. ఇది కాషాయ న‌వ‌భార‌తం.. : అఖిలేష్ యాదవ్

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే  యూనివ‌ర్సిటీ కట్టినందుకు గాను ఆజంఖాన్ జైలులో ఉండగా, రైతులను చంపిన కేసులో కేంద్ర మంత్రి కుమారుడు బెయిల్‌పై ఉన్నారని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది  కాషాయ పార్టీ "నవ భారతదేశం" అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 
 

NATIONAL Feb 11, 2022, 4:48 PM IST

Union Minister Ajay Mishra Responce About Sons BailUnion Minister Ajay Mishra Responce About Sons Bail

Lakhimpur Kheri violence: ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌.. కుమారుడి బెయిల్ పై కేంద్ర మంత్రి రియాక్ష‌న్ ఇదే.. !

akhimpur Kheri violence: వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న ప్ర‌ధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. బెయిల్ రావ‌డంపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర స్పంద‌న‌ను మీడియా కోరింది.
 

NATIONAL Feb 11, 2022, 4:13 PM IST

Union Ministers Son, Accused Of Running Over Farmers In UP, Gets BailUnion Ministers Son, Accused Of Running Over Farmers In UP, Gets Bail

Lakhimpur Kheri violence: లఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న‌.. ప్ర‌ధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుని బెయిల్

Lakhimpur Kheri violence: వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పై కేంద్ర మంత్రి కాన్వాయ్ ని పొనిచ్చి.. 8 మంది ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న ప్ర‌ధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు అయింది. ల‌క్నో హైకోర్టు బెంచ్ నిందితునికి బెయిల్ మంజూరు చేసింది. 
 

NATIONAL Feb 10, 2022, 2:20 PM IST

Lakhimpur Kheri case: Ashish Misra named prime accused in 5,000-page charge sheetLakhimpur Kheri case: Ashish Misra named prime accused in 5,000-page charge sheet

Lakhimpur Kheri case: ఆశిష్ మిశ్రానే ప్రధాన నిందితుడు, 5 వేల పేజీలతో చార్జీషీట్ దాఖలు

నూతన  వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై నుండి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారును నడిపించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనిమిది మంది మరణించారు.

NATIONAL Jan 3, 2022, 3:38 PM IST

SIT arrests two farmers in attack on BJP workers in Lakhimpur KheriSIT arrests two farmers in attack on BJP workers in Lakhimpur Kheri

లఖీంపూర్ ఖేరీలో బీజేపీ కార్యకర్తలపై దాడి ఘటనలో ఇద్దరు రైతులను అరెస్టు చేసిన సిట్

లఖీంపూర్ ఖేరీలో  బీజేపీ కార్యకర్తలపై దాడి చేసిన ఇద్దరు రైతులను సిట్ అరెస్టు చేసింది. గతేడాది అక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరీలో చెలరేగిన హింసాకాండలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉంద‌నే అభియోగంతో ఇద్దరి రైతులను సిట్ అరెస్టు చేసింది. గ‌తంలో కొంత మంది అనుమానుత‌ల ఫొటోల‌ను సిట్ విడుద‌ల చేసింది. ఇందులో ఇద్ద‌రు కోసం పోలీసులు వెతుకుతున్నారు. గ‌త రెండు నెల‌ల నుంచి వారు పోలీసుల నుంచి త‌ప్పించుకొని తిరుగుతున్నారు. అరెస్టు చేసిన చేసిన రైతుల పేర్లు కమల్‌జీత్‌ సింగ్‌ (29), కవల్‌జీత్‌ సింగ్‌ సోను (35)గా సిట్ గుర్తించింది. 
 

NATIONAL Jan 2, 2022, 2:59 PM IST