నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి తోడుగా ఉండాలని, వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండాలని. రూ. 25లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
Andhra Pradesh Nov 22, 2021, 1:07 PM IST
రాష్ట్రానికి amaravati అన్ని విధాలా సరైన రాజధాని అని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అబివృద్ది కి టీడీపీ కట్టుబడి ఉందని gorantla butchaiah chowdary చెప్పారు. రాజధాని రైతులను పెయిడ్ అరిస్టులు అంటూ వైసీపీ నేతలు విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి ఓకే రాజధాని ఉండాలన్నారు.
Andhra Pradesh Nov 22, 2021, 1:04 PM IST
ఏపీ అసెంబ్లీలో జగన్ సర్కార్ ప్రవేశ పెట్టే కొత్త బిల్లులో ఏముంటుందోననే విషయమై ఉత్కంఠగా చూస్తున్నామన్నారు. amaravatiనే రాజధానిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Andhra Pradesh Nov 22, 2021, 12:50 PM IST
మూడు రాజధానుల అంశంపై అమరావతి రైతులతో పాటు టీడీపీ నేతలు,పలు సంస్థలు కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టు రోజువారీ విచారణను నిర్వహిస్తున్నాయి.
Andhra Pradesh Nov 22, 2021, 11:41 AM IST
అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరులో వారు రైతు పాదయాత్రలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల పాదయాత్ర దేవస్థానం చేరేలోపే జగన్తో అమరావతి రాజధానిపై ప్రకటన చేయిస్తామని వివరించారు. రైతులపై పోలీసుల దాడిని ఖండించారు. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Andhra Pradesh Nov 21, 2021, 6:16 PM IST
ఆదివారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని 90 శాతం హమీలను బీజేపీ నెరవేర్చిన విషయాన్ని సోము వీర్రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Andhra Pradesh Nov 21, 2021, 11:44 AM IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కుప్పం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కృష్ణరాఘవ జయేంద్రభరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్ధానిక సంస్ధల కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేఆర్జే భరత్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ బీ–ఫామ్ అందజేశారు.
Andhra Pradesh Nov 20, 2021, 12:12 PM IST
కౌన్సిల్ చైర్మన్ గా వైఎస్ఆర్ సీపీకి చెందిన దళితుడు రాబోతున్నారని, ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు స్టేషన్ లోకి వెళ్లిపోయారని, ఏం మాట్లాడుతున్నారో? ఏం చేస్తున్నారో ఆయనకు అర్థం కావడం లేదని జగన్ అన్నారు. సంబంధం లేని టాపిక్ ను చంద్రబాబు సభలోకి తీసుకువస్తారని, సభలో వాతావరణాన్ని చంద్రబాబే రెచ్చగొడతారని సీఎం ఆరోపించారు.
Andhra Pradesh Nov 19, 2021, 5:02 PM IST
రాష్ట్రపతి సంతకం లేకుండా దిశ బిల్లును చట్టం అని ఎలా చెబుతారు? అంటూ టీడీపీ సభ్యులు మండలిలో హోంమంత్రిని నిలదీశారు. రాష్ట్రపతి ఆమోదం పొందకుండానే దిశ చట్టం ఎలా అవుతుందని, అప్లికేషన్ గానే చూడాలని టీడీపీ సభ్యులు రామారావు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల, ఎమ్మిగనూరు లో Rapeకి గురైన మహిళల కేసును సీబీఐకి అప్పగిస్తామని హోంమంత్రి ఏడాది క్రితం ప్రకటించిన అమలు కాలేదని సభ్యుడు ఫరూక్ సభ దృష్టికి తీసుకువచ్చారు.
Andhra Pradesh Nov 19, 2021, 3:31 PM IST
భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సిఎం అధికారులతో చర్చించారు. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి ఐదు లక్షల రూపాయల పరిహారం వీలైనంత త్వరగా అందించాలని తెలిపారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు సీఎం జగన్.
Andhra Pradesh Nov 19, 2021, 1:34 PM IST
బుధవారమే గవర్నర్ ఆరోగ్య పరిస్థితి మీద వైద్యులతో మాట్లాడిన సీఎం జగన్ సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, 88యేళ్ల గవర్నర్ Bishwabhushan Harichandan నవంబర్ 17న మధ్యాహ్నం ఒంటిగంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు.
Andhra Pradesh Nov 18, 2021, 3:55 PM IST
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి... టిడిపి ఎమ్మెల్యేలతో ర్యాలీగా అసెంబ్లీకి చంద్రబాబు
Andhra Pradesh Nov 18, 2021, 11:33 AM IST
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన పలు నగరపాలక, మున్సిపాలిటీల ఫలితాలు ఇవాళ(బుధవారం) వెలువడ్డాయి. ఒక్క దర్శి మినహా అన్నిచోట్ల వైసిపి విజయ ఢంకా మోగించింది. టిడిపి చీఫ్ చంద్రబాబు ఇలాకా కుప్పంలో కూడా వైసిపి విజయం సాధించింది. నెల్లూరు కార్పోరేషన్ కూడా క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది.
Andhra Pradesh Nov 17, 2021, 8:27 AM IST
అసెంబ్లీ సమావేశానికి ముందు జరపాలని బావించిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నుండి ప్రకటన వెలువడింది.
Andhra Pradesh Nov 17, 2021, 7:35 AM IST
ఏపీ రాజధానిగా కేవలం అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపడుతున్న పోరాటం 700రోజులకు చేరింది. ఈ సందర్భంగా మరోసారి అమరావతి ఉద్యమానికి, రైతుల పాదయాత్రకు లోకేష్ మద్దతు ప్రకటించారు.
Andhra Pradesh Nov 16, 2021, 4:49 PM IST