విశాఖలో 31, 61 వార్డులను అధికార వైసిపి కైవసం చేసుకుంది. 31వ వార్డులో 28 ఓట్లతో వైసిపి అభ్యర్థి గెలుపొందాడు. దీంతో ఇక్కడ రీకౌంటింగ్ జరపాలని టిడిపి కోరుతోంది.
- Home
- Andhra Pradesh
- AP Election Result 2021 Highlights: చంద్రబాబు ఇలాకాలో వైసిపి పాగా... కుప్పం సహా అన్నీ అధికార పార్టీవే
AP Election Result 2021 Highlights: చంద్రబాబు ఇలాకాలో వైసిపి పాగా... కుప్పం సహా అన్నీ అధికార పార్టీవే

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన పలు నగరపాలక, మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ఇవాళ (బుధవారం) ఉదయమే ప్రారంభమయ్యింది. అయితే టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ ఫలితం కూడా నేడే వెలువడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంతో పాటు నెల్లూరు కార్పోరేషన్, బుచ్చిరెడ్డిపాలెం, కమలాపురం నగర పంచాయితీ, రాజంపేట మున్సిపాలిటీల ఫలితం నేడు వెలువడనుంది.
విశాఖలో రెండు డివిజన్లు వైసిపివే...
నెల్లూరు కార్పోరేషన్లో క్లీన్ స్వీప్ దిశగా వైసిపి
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్లో అధికార వైసిపి క్లీన్ స్వీప్ దిశగా వెళుతోంది. మొత్తం 54 డివిజన్లకు గాను ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఇక తాజాగా 20డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
కాకినాడలో వైసిపి క్లీన్ స్వీప్
కాకినాడ కార్పోరేషన్ లో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. నాలుగు డివిజన్లలో ఉపఎన్నిక జరగ్గా అన్నింటా వైసిపి విజయం సాధించింది. 3,9, 16,30 డివిజన్లలో వైసిపి విజయం సాధించింది.
దర్శి మినహా అన్ని మున్సిపాలిటీలు వైసిపివే...రెండు చోట్ల హోరాహోరీ
ఎన్నికలు జరిగిన 12 మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. 9 మున్సిపాలిటీలను వైసిపి, ఒక్క దర్శిని మాత్రమే టిడిపి దక్కించుకుంది. ఇక జగ్గయ్యపేట, కొండపల్లిలో టిడిపి, వైసిపిల మధ్య హోరాహోరీ సాగుతోంది.
మంత్రి బుగ్గనకు షాక్...
బేతంచెర్లలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ నివాసముండే వార్డులో 88ఓట్లతో టిడిపి అభ్యర్థి విజయం సాధించాడు.
ఒక్కఓటుతో వైసిపి అభ్యర్థి విజయం... రెండు సార్లు రీకౌంటింగ్ చేసినా అదే పలితం
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం 8వ వార్డు ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కేవలం ఒక్క ఓటు తేడాతో వైసిపి అభ్యర్థి విజయం సాధించాడు. ఇప్పటికే రెండుసార్లు రికౌంటింగ్ చేసినా అదే ఫలితం వచ్చింది. అధికారులు తనను మోసం చేస్తున్నారని టిడిపి అభ్యర్థి నిరసనకు దిగాడు.
అకివీడులో రీకౌంటింగ్ కు వైసిపి పట్టు
పశ్చిమ గోదావరి జిల్లా అకివీడులోని 10వార్డులో జనసేన పార్టీ అభ్యర్ధి కేవలం 9ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీంతో వైసిపి రీకౌంటింగ్ కు పట్టుబడుతోంది.
జగ్గయ్యపేట కౌటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట కౌటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వైసిపి ఎమ్మెల్యే ఉదయభాను కౌటింగ్ కేంద్రంలోకి వెళ్లడంతో టిడిపి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే గలాటి సృష్టించేందుకే వచ్చారంటూ కలెక్టర్, ఎస్పీకి టిడిపి ఫిర్యాదు చేసింది.
నెల్లూరులోనూ వైసిపిదే హవా
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ లోనూ వైసిపి హవా కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 54 డివిజన్లు కాగా ఇప్పటికే వైసిపి 9 చోట్ల విజయం సాధించింది.
కొండపల్లిలో వైసిపి, టిడిపి హోరాహోరీ
కృష్ణా జిల్లా కొండపల్లిలో వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మొత్తం 29వార్డులకు గాను ఇప్పటివరకు వైసిపి 8, టిడిపి 7 చోట్ల విజయం సాధించాయి. మరోచోట ఇండిపెండెంట్ గెలిచారు.
ఆకివీడు కూడా వైసిపిదే...
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో వైసిపి విజయం సాధించింది. మొత్తం 20 వార్డులకుగాను వైసిపికి అత్యధికంగా 12చోట్ల గెలుపొందింది. ఇక టిడిపి 4, జనసేన 3 వార్డుల్లో విజయం సాధించాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందాడు.
పెనుగొండలో వైసిపి విజయకేతనం... ఖాతా తెరవని టిడిపి
అనంతపురం జిల్లా పెనుగొండలో అధికార వైసిపి ఘన విజయం సాధించింది. ఇక్కడ టిడిపి కనీసం ఖాతాకూడా తెరవలేదు. 20వార్డులకు గాను 18వార్డులను వైసిపి కైవసం చేసుకుంది.
గురజాలలో వైసిపి విజయకేతనం
గుంటూరు జిల్లా గురజాలలో వైసిపి 16, టిడిపి 3, జనసేన 1చోట విజయం సాధించారు.
బిగ్ బ్రేకింగ్... చంద్రబాబుకు షాక్... కుప్పంలో వైసిపిదే గెలుపు
మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సొంతనియోజకవర్గం కుప్పంలోనూ తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పలేదు. మొత్తం 25 వార్డులకు గాను వైసిపి 14వార్డులను కైవసం చేసుకుంది. టిడిపి కేవలం 2చోట్ల మాత్రమే విజయం సాధించింది.
దర్శి నగరపంచాయితీ టిడిపిదే...
ప్రకాశం జిల్లా దర్శి నగరపంచాయితీని టిడిపి కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను టిడిపి 13 వార్డుల్లో విజయం సాధించింది. ఇక వైసిపి మిగిలిన 7 వార్డులను దక్కించుకుంది.
బేతంచర్ల మున్సిపాలిటీ వైసిపి కైవసం
కర్నూల్ జిల్లా బేతంచర్ల మున్సిపాలిటీలో వైసిపి విజయం సాధించింది. 20వార్డులకు గాను 12 వార్డుల్లో వైసిపి, టిడిపి 4వార్డులను కైవసం చేసుకుంది.
దర్శిలో టిడిపి హవా
ప్రకాశం జిల్లా దర్శిలో 20 వార్డులకు గాను 14,15,17,18,19 వార్డుల్లో టిడిపి విజయం సాధించింది.
కుప్పంలో అధిక వార్డుల్లో టిడిపి ఆధిక్యం...
కుప్పంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 3,10, 11,12,15 వార్డుల్లో టిడిపి ముందంజలో వుంది. ఇక 1,2, 7 వార్డుల్లో వైసిపి ముందంజలో వుంది. మిగిలిన వార్డుల్లో వైసిపి, టిడిపి మధ్య హోరాహోరీ ఫైట్ సాగుతోంది.
కమలాపురం వైసిపి వశం
కమలాపురం మున్సిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను వైసిపి 15, టిడిపి 5 వార్డుల్లో విజయం సాధించింది.
జగ్గయ్యపేటలో హోరాహోరీ
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైసిపి 2, టిడిపి 2 వార్డుల్లో విజయం సాధించాయి.