దిశ నిందితుల కుటుంబసభ్యులు హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలకు రీ పోస్టు మార్టం సోమవారం నాడు ఉదయం ప్రారంభమైంది.
Telangana Dec 23, 2019, 11:09 AM IST
హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలకు సోమవారం నాడు ఉదయం ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టంను ప్రారంభించారు.. ముగ్గురు ఫోరెన్సిక్ టీమ్ బృందం నేతృత్వంలో రీ పోస్టుమార్టం సాగుతోంది.
దిశ నిందితుల మృతదేహాలకు న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించనుంది. న్యూఢీల్లికి చెందిన ముగ్గురు ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డుకు ఈ బాధ్యతలను అప్పగించింది తెలంగాణ హైకోర్టు.
దిశ నిందితుల మృతదేహాల భద్రత, మృతదేహాల అప్పగింతపై సామాజిక కార్యకర్త సజయ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు శనివారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని సూచించింది.
ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా రీ పోస్టుమార్టం పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శనివారం నాడు హైకోర్టుకు వివరించారు. దీంతో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టులను భద్రపర్చాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణకు చెందిన నిపుణులైన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన విషయాన్ని కూడ అడ్వకేట్ జనరల్ దృష్టికి తెచ్చినా కూడ హైకోర్టు అంగీకరించలేదు. రీ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది.
రీపోస్టుమార్టం ప్రక్రియను మొత్తం షూట్ చేసి సీడీలను హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్కు అప్పగించాలని సూచించింది. ఎయిమ్స్ డాక్టర్లకు విమాన టిక్కెట్లు, వసతి, ఇతర ఖర్చులను కూడ తెలంగాణ ప్రభుత్వం భరించాలని హైకోర్టు ఆదేశించింది.ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ టీమ్ నాలుగు మృతదేహాలను క్షుణ్ణంగా రీ పోస్టుమార్టం చేసిన తర్వాత నివేదికను హైకోర్టు రిజిష్ట్రార్ కు అందించాలని కోరింది.
Telangana Dec 23, 2019, 9:06 AM IST
అక్రమ సంబంధం వద్దన్నందుకు తన ఇద్దరు ప్రియుళ్లతో కలిసి హత్య చేసేందుకు ఓ భార్య చేసిన కుట్ర నుంచి ఓ భర్త తృటిలో తప్పించుకున్నాడు
Karimanagar Dec 22, 2019, 8:43 PM IST
గత ఐదేళ్ల పాలనలో టీఆర్ఎస్ నాయకులనే కోటీశ్వరులుగా మారారంటూ ఫైరయ్యారు. టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి.
Telangana Dec 22, 2019, 7:48 PM IST
ఊహాకి కూడా అందని నేరాలతో తెలంగాణ రాష్ట్రం వార్తల్లో నిలిచింది. దిశ హత్యాచారం, ఎమ్మార్వోపై సజీవదహనం, హాజీపూర్ అత్యాచార కేసులతో పాటు మరిన్ని నేరాలు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి.
Telangana Dec 22, 2019, 5:51 PM IST
దిశ నిందితుల మృతదేహాలు ఈ నెల 23వ తేదీన ఆయా కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఈ నెల 21వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Weekend Special Dec 22, 2019, 3:57 PM IST
దేశంలో సంచలనం సృష్టించిన రెండు కేసులపై న్యాయస్ధానాలు ఈ వారం కీలక తీర్పులు వెలువరించాయి. ఉన్నావ్ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ మాజీ నేత కుల్దీప్ సెంగార్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే 2008లో జైపూర్లో జరిగిన వరుస బాంబు పేలుళ్లుకు సంబంధించి నలుగురికి ఉరిశిక్ష విధించింది. వీటిలో పాటు మరిన్ని నేరవార్తలు మీకోసం.
Weekend Special Dec 22, 2019, 3:30 PM IST
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను పోలీసులు, కోర్టులు కూడ కాపాడలేకపోతున్నాయని మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్ అభిప్రాయపడ్డారు.
Telangana Dec 22, 2019, 1:40 PM IST
దిశ నిందితుల మృతదేహాలకు న్యూఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డాక్టర్ల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించనుంది. న్యూఢీల్లికి చెందిన ముగ్గురు ఎయిమ్స్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన మెడికల్ బోర్డుకు ఈ బాధ్యతలను అప్పగించింది తెలంగాణ హైకోర్టు.
Telangana Dec 22, 2019, 8:58 AM IST
నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేటలో డెలీవరీ సమయంలో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు తలను కోసిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ ప్రజారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Telangana Dec 21, 2019, 9:34 PM IST
దేశాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన దిశ ఘటన గురించి అందరికి తెలిసిందే. సాధారణ జనం నుంచి సెలబ్రెటీల వరకు అందరిని కదిలించిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు పారిపోతుండగా ఎన్ కౌంటర్ చేయడం మరొక షాకింగ్ న్యూస్. ఇక ఘటనపై భిన్నాభిప్రాయాలు వేస్తున్నప్పటికీ ఇంకా కేసు ఒక కొలిక్కి రావడం లేదు.
News Dec 21, 2019, 9:02 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Telangana Dec 21, 2019, 5:25 PM IST
డెలీవరి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు శిశువు తల కోసేయడంతో.. బిడ్డ మొండెం తల్లిగర్భంలోనే ఉండిపోయింది. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Telangana Dec 21, 2019, 2:54 PM IST
హైదరాబాద్: దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు శనివారం నాడు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు.
శనివారం నాడు దిశ నిందితుల మృతదేహాల విషయమై హైకోర్టు విచారించింది.
Telangana Dec 21, 2019, 1:27 PM IST
దిశపై అత్యాచారం,హత్య చేసిన కేసులో ఎన్కౌంటర్కు గురైన నలుగురు నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.
Telangana Dec 21, 2019, 11:35 AM IST