హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియడంతో ఇప్పుడు గెలుపు ఎవరిదని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుచోట్ల భారీగా బెట్టింగ్లు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హుజురాబాద్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు సాగినట్టుగా తెలుస్తోంది.
Telangana Oct 30, 2021, 8:16 PM IST
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న హుజురాబాద్ (huzurabad byPoll) ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. గత రికార్డులు అన్నీ చెరిపేస్తూ భారీ పోలింగ్ (polling) నమోదవుతోంది. ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి లాభిస్తుందో, ఏ పార్టీని ముంచేస్తోందోననే ఆందోళన నేతలు, అభ్యర్ధుల్లో కనిపిస్తోంది.
Telangana Oct 30, 2021, 7:57 PM IST
పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థఇ ఈటల రాజేందర్ కాన్వాయ్లోని మూడు వాహనాలనకు పోలీసులు అడ్డుకున్నారు. అందులో ఒక వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు.
Telangana Oct 30, 2021, 5:45 PM IST
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కమలాపూర్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం 262లో ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమునా రెడ్డి ఓటు వేశారు.
Telangana Oct 30, 2021, 10:09 AM IST
హుజరాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ మండలంలోని గుండెడు గ్రామంలో మహిళలు గ్యాస్ సిలిండర్ కి దండం పెట్టి ఓటు వేయడానికి బయల్దేరారు.
Telangana Oct 30, 2021, 9:47 AM IST
హుజురాబాద్ ఉపఎన్నికలో అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటర్లు తమ తీర్పును ఈవిఎం మిషన్లలో పొందుపరుస్తున్నారు.
Telangana Oct 30, 2021, 7:01 AM IST
హుజురాబాద్ లో పోలింగ్ కొన్నిగంటల ముందు వరంగల్ లో మీడియాతో మాట్లాడాలని భావించిన బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
Telangana Oct 29, 2021, 3:04 PM IST
ఈ నియోజకవర్గంలోని వీణవంక మండలం గంగారం గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున గుమికూడి తమకు ఎందుకు డబ్బులు ఇవ్వరని ప్రశ్నించారు. ఇదే గ్రామానికి చెందిన కొందరికి డబ్బులు ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
Telangana Oct 28, 2021, 3:56 PM IST
వరి వేస్తే ఉరి అని సీఎం ఎందుకు అన్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారన్నారని ఆయన గుర్తుచేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారా.. టీఆర్ఎస్ ప్రభుత్వం కర్షకులను ఆదుకుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Telangana Oct 28, 2021, 3:02 PM IST
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన అగ్రనేతలంతా ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వెంకట్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితం సాధించకపోతే రేవంత్ రెడ్డిపై ప్రత్యర్ధులకు అవకాశం చిక్కుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Telangana Oct 27, 2021, 4:14 PM IST
ఇటీవల నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో Jana Reddyని ఓడించి Bhagath yadav విజయం సాధించాడు. భగత్ యాదవ్ విజయం సాధించిన తర్వాత నాగార్జునసాగర్ కు వెళ్లిన పలు అభివృద్ది కార్యక్రమాలకు కేసీఆర్ శంకుస్థాపనలు చేశారని ఆయన గుర్తు చేశారు.
Telangana Oct 27, 2021, 3:06 PM IST
బీజేపీపై టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు (Harish rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే గ్యాస్ ధర (gas price)పెంచుతారని ఆయన ఆరోపించారు. కేవలం హుజురాబాద్ పోలింగ్ కోసమే గ్యాస్ ధర ఆపారని హరీశ్ వ్యాఖ్యానించారు
Telangana Oct 27, 2021, 2:14 PM IST
హుజురాబాద్ని అభివృద్ధి చేశానని ఈటల రాజేందర్ (etela rajender) అన్నారని.. కానీ అది ఎవరి కాలంలో చేశారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, ఈ జిల్లా మంత్రిగా, కేసీఆర్ నాయకత్వంలోనే ఈ కార్యక్రమాలు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు
Telangana Oct 27, 2021, 1:34 PM IST
హుజురాబాద్ ఉపఎన్నికల్లో (huzurabad bypoll) డబ్బులు పంపిణీ అన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక ఓటుకు రూ.6 వేల చొప్పున పంపణీ చేస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. కమలాపూర్లో (kamalapur) కవర్పై ఓటర్ల నెంబర్ వేసి నగదు పంపిణీ చేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.
Telangana Oct 27, 2021, 11:59 AM IST
దళితబంధుకు (dalitha bandhu) వ్యతిరేకంగా తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు తెలంగాణ బీజేపీ (bjp) చీఫ్ బండి సంజయ్ . టీఆర్ఎస్ పార్టీ డబ్బును నమ్ముకుందని ఆయన ఎద్దేవా చేశారు. దళితుల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని.. తాను తవ్విన గోతిలో తానే పడిందంటూ సంజయ్ సెటైర్లు వేశారు.
Telangana Oct 27, 2021, 10:45 AM IST