ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అతిథులకు వంటలు సిద్దం చేస్తున్న వ్యక్తి లాలాజలంతో నాన్‌ తయారుచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా  మారింది. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలో మోదీనగర్‌లో ఓ వ్యక్తి నీచమైన పనికి పాల్పడ్డాడు. లాలాజలంతో నాన్‌ తయారుచేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఇది ఓ పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ వ్యక్తి తన లాలాజలంతో నాన్స్ తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఆ ఘటన గోవింద్‌ పురి కాలనీలో జరిగిన ఓ వివాహ వేడుక సమయంలో చోటుచేసుకుందని గుర్తించారు. 

ఆ వీడియోలో నాన్స్ చేస్తున్న వ్యక్తి దానిని కాల్చడానికి ముందు ఉమ్మును ఉంచుతున్నాడు. దీనిని గమనించిన ఎవరో ఆ దృశ్యాలను రికార్డు చేసి.. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. 

ఇందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఘజియా‌బాద్ పోలీసు ఉన్నతాధికారులు.. విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని మోదీనగర్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ ఆదేశించినట్టుగా తెలిపారు.