MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Ration Card: స‌మ‌యం లేదు మిత్ర‌మా.. ఇలా చేయ‌క‌పోతే రేష‌న్ కార్డు ర‌ద్దడం ఖాయం, ఇంకో 10 రోజులే

Ration Card: స‌మ‌యం లేదు మిత్ర‌మా.. ఇలా చేయ‌క‌పోతే రేష‌న్ కార్డు ర‌ద్దడం ఖాయం, ఇంకో 10 రోజులే

Ration Card: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రేషన్ కార్డులో నమోదైన ప్రతి సభ్యుడు తప్పనిసరిగా జూలై 31లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేక‌పోతే ప్రభుత్వ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 19 2026, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రతి కుటుంబ సభ్యుడికి e KYC తప్పనిసరి
Image Credit : Gemini AI

ప్రతి కుటుంబ సభ్యుడికి e-KYC తప్పనిసరి

రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ విడివిడిగా తమ వివరాలను ధృవీకరించుకోవాలి. కుటుంబంలో ఒకరు మాత్రమే e-KYC చేయించుకుంటే సరిపోదు. ప్రతి సభ్యుడు ఆధార్ ఆధారిత వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ద్వారా గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో సరిగ్గా ఉండేలా ఈ ధృవీకరణ చేపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎక్కడ చేయించాలి.. ఎలాంటి పత్రాలు తీసుకెళ్లాలి?
Image Credit : Asianet News

ఎక్కడ చేయించాలి.. ఎలాంటి పత్రాలు తీసుకెళ్లాలి?

e-KYC కోసం సమీపంలోని రేషన్ దుకాణం లేదా మీసేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. రేషన్ కార్డుతో పాటు అందులో నమోదైన ప్రతి సభ్యుడి అసలు ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాలి. అక్కడ బయోమెట్రిక్ లేదా ఐరిస్ ధృవీకరణ పూర్తయిన వెంటనే e-KYC ప్రక్రియ ముగుస్తుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. ఎవరు డబ్బులు అడిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ సూచిస్తోంది.

Related Articles

Related image1
Bullet Train: హైదరాబాద్ టూ శ్రీశైలం.. ఇక జస్ట్ గంటలోనే ప్రయాణం. త్వరలోనే సాకారం..
Related image2
అహంకారం త‌ల‌కెక్కితే కాలం గుణపాఠం చెబుతుంది.. అన్నీ ఉన్న‌ప్పుడే నువ్వెంటో తెలిపే క‌థ
35
e-KYC ఎందుకు చేస్తున్న ప్రభుత్వం?
Image Credit : Asianet News

e-KYC ఎందుకు చేస్తున్న ప్రభుత్వం?

అర్హులైన కుటుంబాలకే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చూడటం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. అలాగే నకిలీ రేషన్ కార్డులు, వినియోగంలో లేని కార్డులను గుర్తించడం, మరణించిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన లబ్ధిదారుల వివరాలను నవీకరించడం కూడా ఇందులో భాగమే. దీంతో రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా e-KYC పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

45
త్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Image Credit : epds.telangana.gov.in

త్వరలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రాష్ట్రంలో కొత్త తరహా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డుల ముద్రణ పూర్తయి జిల్లాలకు పంపించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆమోదం లభించిన వెంటనే పంపిణీ తేదీని ప్రకటించనున్నారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పరిమాణంలో రూపొందించిన ఈ కార్డుపై లబ్ధిదారుడి పేరు, చిరునామా, ఫొటోతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటివరకు పొందిన రేషన్ సరుకుల వివరాలు కూడా కనిపిస్తాయి. టి-రేషన్ యాప్ ద్వారా కూడా ఈ కార్డును లింక్ చేసుకుని సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఈ కార్డుల తయారీకి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

55
జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్.. గడువు దాటక ముందే పూర్తి చేయండి
Image Credit : X

జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్.. గడువు దాటక ముందే పూర్తి చేయండి

రాష్ట్రవ్యాప్తంగా ఇంకా e-KYC పూర్తి చేయని లబ్ధిదారుల కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అవసరమైన చోట్ల ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తల సహకారంతో ఇంటింటికీ వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయించే చర్యలు కొనసాగుతున్నాయి. అవసరమైతే రేషన్ దుకాణాల పని వేళలను కూడా పొడిగించాలని అధికారులకు సూచించారు. కాబట్టి రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు జూలై 31లోపు తప్పనిసరిగా e-KYC పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image2
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image3
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
Bullet Train: హైదరాబాద్ టూ శ్రీశైలం.. ఇక జస్ట్ గంటలోనే ప్రయాణం. త్వరలోనే సాకారం..
Recommended image2
అహంకారం త‌ల‌కెక్కితే కాలం గుణపాఠం చెబుతుంది.. అన్నీ ఉన్న‌ప్పుడే నువ్వెంటో తెలిపే క‌థ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved