MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • దేశ ప్రజలకు మోదీ మరోసారి కీలక సందేశం.. ఈ విష‌యాలు గుర్తుపెట్టుకోండి అంటూ

దేశ ప్రజలకు మోదీ మరోసారి కీలక సందేశం.. ఈ విష‌యాలు గుర్తుపెట్టుకోండి అంటూ

PM Modi: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ (GDP) వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైన నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్ర‌ధాని సూచించారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 01 2026, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
7.8 శాతం వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
Image Credit : Narendra Modi/X

7.8 శాతం వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు నమోదైన 7.8 శాతం ఆర్థిక వృద్ధి ప్రజల కృషి, సంకల్పానికి ప్రతిబింబమని ప్రధాని మోదీ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 7 శాతంతో పోలిస్తే తాజా వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం విశేషమని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్‌ తన అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. దేశ ప్రజల భాగస్వామ్యం, కష్టపడే తత్వం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని మోదీ అభిప్రాయపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యుద్ధాలు, సంక్షోభాల మధ్య భారత్‌ పురోగతి
Image Credit : Facebook

యుద్ధాలు, సంక్షోభాల మధ్య భారత్‌ పురోగతి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు, ఇంధన సరఫరాకు సంబంధించిన సమస్యలు, అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్నాయని ప్రధాని గుర్తుచేశారు. వీటి ప్రభావంతో సరఫరా వ్యవస్థలు కూడా అనేక సందర్భాల్లో దెబ్బతిన్నాయని చెప్పారు. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ దేశాలు వరుస సవాళ్లను ఎదుర్కొంటున్నాయని మోదీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగడం దేశ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. భారత్‌ ఆర్థిక పురోగతిపై కొందరు అనవసరమైన సందేహాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నప్పటికీ దేశ ప్రజలు వాటిని పట్టించుకోకుండా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని మోదీ అన్నారు.

Related Articles

Related image1
Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి
Related image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
35
విదేశీ పర్యటనలకు బదులు దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యం
Image Credit : ANI

విదేశీ పర్యటనలకు బదులు దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యం

ఆర్థిక వృద్ధి మరింత బలపడాలంటే దేశీయంగా డబ్బు చలామణి పెరగాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. ఇందులో భాగంగా అవసరం లేని విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు నిర్వహించే బదులు భారత్‌లోనే వివాహ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివాహాలు, పర్యాటక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, రవాణా, సేవా రంగాలకు ఆదాయం పెరుగుతుందని ఆయన సందేశం ఇచ్చారు.

7.8% growth. 

Strong numbers. 

Even stronger confidence. pic.twitter.com/ZVPpnAXrVU

— Narendra Modi (@narendramodi) September 1, 2026

45
‘వోకల్ ఫర్ లోకల్’.. స్వదేశీ వస్తువుల వినియోగం పెంచాలి
Image Credit : Asianet News

‘వోకల్ ఫర్ లోకల్’.. స్వదేశీ వస్తువుల వినియోగం పెంచాలి

భారత్‌ ఆత్మనిర్భర్‌గా ఎదగాలంటే ప్రజల కొనుగోలు విధానంలోనూ మార్పు రావాలని మోదీ అన్నారు. సాధ్యమైనంత వరకు దేశంలో తయారయ్యే ఉత్పత్తులు, స్థానికంగా అందుబాటులో ఉన్న సేవలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ‘వోకల్ ఫర్ లోకల్’ భావనను ప్రజలు మరింత విస్తృతంగా స్వీకరించాలని సూచించారు. భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే దేశీయ తయారీ రంగం, చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు బలోపేతం అవుతాయని చెప్పారు. అలాగే అవసరం లేని సమయంలో బంగారం కొనుగోలు చేయకుండా ఉండటం కూడా దేశ ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రజలు ప్రత్యక్షంగా మద్ధతు ఇవ్వగలరని వివరించారు.

55
2047 నాటికి వికసిత్ భారత్‌ లక్ష్యం
Image Credit : X/Narendra Modi

2047 నాటికి వికసిత్ భారత్‌ లక్ష్యం

భారత్‌ స్వాతంత్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా పనిచేస్తే దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా యువత ఆకాంక్షలకు అనుగుణంగా అవకాశాలను పెంచుతూ, ఆత్మనిర్భరతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధిని ఒక విజయంగా భావించడంతో పాటు, భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తుల వినియోగం నుంచి స్థానిక వ్యాపారాలకు మద్ధతు ఇవ్వడం వరకు ప్రతి చిన్న నిర్ణయం వికసిత్ భారత్‌ లక్ష్యానికి దోహదం చేస్తుందని మోదీ పేర్కొన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: నేపాల్ లో విధ్వంసం సృష్టించిన వరదలు రంగంలోకి హెలికాఫ్టర్స్ | Asianet News Telugu
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి గుండెను పిండేసే దృశ్యాలు | Asianet News Telugu
Recommended image3
Now Playing
నేపాల్ వరదల్లో వందలమంది గల్లంతు హెలికాఫ్టర్ తో రెస్క్యూ ఆపరేషన్ | Nepal Rescue Operation
Related Stories
Recommended image1
Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి
Recommended image2
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved