ఒక్కసారి ఈ గుడికి వెళ్లి పూజ చేస్తే...మీ కారుకు ప్రమాదమే జరగదు, ఈ గుడి ఎక్కడ ఉంది?
ఇంటి నుంచి బయటకు వెళితే.. క్షేమంగా ఇంటికి వస్తామో లేదో అనే భయం చాలా మందికి ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు రోడ్డు ప్రమాదం జరుగుతుందో అనే భయం ఉంటుంది.కానీ, ఓ గుడికి వెళ్తే రోడ్డు ప్రమాదాలే జరగవని మీకు తెలుసా?

Vehicle Temple
కొత్తగా కారు లేదా బైక్ కొన్నారా? జీవితంలో ఎప్పటికీ.. మీ వెహికల్ కి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, మీరు కూడా క్షేమంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే.. కచ్చితంగా ఓ అమ్మవారి గుడికి వెళ్లాల్సిందే. ఈ అమ్మవారి గుడికి ఒక్కసారి వెళ్లి.. మీ వెహికిల్ కి పూజ చేయించి,అక్కడ మీ నెంబర్ ప్లేట్ ని రాస్తే.. జీవితంలో ప్రమాదానికి గురి అవ్వదు. మరి, ఆ గుడి ఎక్కడ ఉంది? ఈ గుడిలో అంత స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం...
ఏంటి ఈ ఆలయ ప్రత్యేకత..
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ కొత్త లారీ, కారు లేదా బైక్ వెనుక చూసినా "తలుపులమ్మ తల్లి ఆశీస్సులతో" అని రాసి ఉండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో వాహన కొనుగోలుదారులు అత్యంత పవిత్రంగా భావించే ఆలయం "తలపులమ్మ లోవ శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం". ఇక్కడికి వచ్చి పూజ చేయిస్తే వాహనానికి, డ్రైవర్కు ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవని భక్తులు గట్టిగా నమ్ముతారు.
కొత్తగా కొన్న వాహనాలను కొండ కిందకు తెచ్చి, అమ్మవారికి ప్రత్యేక వాహన పూజలు జరిపిస్తారు. పూజ పూర్తయ్యాక, వాహనాలు ప్రమాదాలకు గురికాకూడదని, వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకుంటూ భక్తులు అక్కడి గోడలపై లేదా రాళ్లపై తమ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్లను రాస్తుంటారు.నిజానికి ఆలయ నిర్వాహకులు గోడలపై రాయడాన్ని నిషేధించినా, భక్తుల నమ్మకం వల్ల ఇది ఇంకా కొనసాగుతుంది.
తలపులమ్మ తల్లి అనే పేరు ఎలా వచ్చింది?
ఆలయ స్థల పురాణం ప్రకారం, పూర్వం అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చెబుతారు. ఇక్కడి అమ్మవారు స్వయంభూమూర్తి.మనస్సులో ఒక్క చిన్న 'తలపు' (ఆలోచన) వచ్చి అమ్మవారిని తలుచుకుంటే చాలు.. కోరిన కోరికలు తీర్చి, భక్తులను ఆపదలనుంచి కాపాడుతుందని, అందుకే అమ్మవారికి తలపులమ్మ తల్లి (తలుపులమ్మ అమ్మవారు) అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు.
ఈ ఆలయం ఎక్కడ ఉంది?
ఈ ప్రసిద్ధ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా, తుని మండలం 'లోవ' గ్రామంలో ఉంది.దారకొండ, తీగకొండ అనే రెండు కొండల మధ్య పచ్చని అటవీ వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. జాతీయ రహదారి (NH16) వద్ద తుని - అన్నవరం మధ్యలో ఉండే ఆర్చ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో లోవ క్షేత్రం ఉంటుంది.
ఈ క్షేత్ర ప్రత్యేకత: ఈ ఆలయానికి కొత్త వాహనంపై కుటుంబంతో వచ్చి పూజ చేయించడం, కొండ దిగువన పచ్చని ప్రకృతి ఒడిలో వంటలు చేసుకుని మొక్కులు తీర్చుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం.
గమనిక: ఆధ్యాత్మిక విశ్వాసాలు భక్తులకు మనోధైర్యాన్ని ఇస్తాయి. అయితే ఏ వాహనానికైనా అసలైన రక్షణ హెల్మెట్, సీట్బెల్ట్ ధరించడం, పరిమిత వేగంతో ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి!
