- Home
- Sports
- Cricket
- India vs Zimbabwe : ఇండియా, జింబాబ్వే T20 సీరిస్ అస్సలు మిస్సవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
India vs Zimbabwe : ఇండియా, జింబాబ్వే T20 సీరిస్ అస్సలు మిస్సవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
India vs Zimbabwe : ఇండియా, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి మొదలవుతోంది. ఈ సిరీస్ చాలా కారణాల వల్ల ప్రత్యేకంగా నిలవనుంది. క్రికెట్ అభిమానులు ఈ సిరీస్ను ఎందుకు చూడాలి అనేందుకు ఇక్కడ ఐదు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.

ఇవాళే ఇండియా-జింబాబ్వే తొలి టీ20 పోరు
భారత్, జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ ఇవాళ (జూలై 23, గురువారం) హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటికే టాస్ కూడా పూర్తయ్యింది… భారత్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అంటే ముందుగా ఆతిథ్య జట్టు బ్యాటింగ్ చేయనుంది. అభిమానులు యునైటెడ్8, డీడీ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ చూడొచ్చు. ఇంతకీ ఈ మ్యాచ్ ఎందుకు చూడాలో తెలుసా?
1. వైభవ్ సూర్యవంశీ కోసం
15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కోసం ఈ సీరిస్ తప్పకుండా చూడాల్సిందే. ఐపిఎల్ లో అదరగొట్టిన ఈ యువ సంచలనం ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన సీరిస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అయితే తీవ్ర ఒత్తిడి కారణంగా ఇంగ్లాండ్ గడ్డపై పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇప్పుడు జింబాబ్వేపై భారీ ఇన్నింగ్స్ ఆడి, అంతర్జాతీయ క్రికెట్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. అతడికి ఇది సువర్ణావకాశం… మరి ఎలా వాడుకుంటాడో చూడాలి.
2. కెప్టెన్గా శ్రేయస్ తొలి విజయం కోసం
టీ20 ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ను కాదని ఐపిఎల్ లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్కు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు బిసిసిఐ సెలెక్టర్లు. కానీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్లలో 6 ఓడిపోయింది, 1 మ్యాచ్ రద్దయింది. అందుకే ఈ జింబాబ్వే టూర్ ద్వారా అయినా కెప్టెన్గా విజయాల ఖాతా తెరవాలని అయ్యర్ ఎదురుచూస్తున్నాడు.
3. హైదరబాదీ ప్లేయర్ తిలక్ వర్మ కోసం
భారత టీ20 జట్టు వైస్-కెప్టెన్ స్థాయికి ఎదిగాడు మన హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ. అయితే ఇటీవలకాలంలో అతడు మిడిల్ ఓవర్లలో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందుకే ఈ సిరీస్ను ఉపయోగించుకుని, దూకుడైన బ్యాటింగ్తో తిరిగి ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు క్రికెట్ ప్రియులు అతడు ఫామ్ లోకి రావాలని కోరుకుంటున్నారు.
4. రింకూకు గోల్డెన్ ఛాన్స్
2026 టీ20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరమైన రింకూ సింగ్కు, మళ్లీ శాశ్వత స్థానం సంపాదించుకోవడానికి జింబాబ్వే సిరీస్ ఒక సువర్ణావకాశం. ఈ సిరీస్లో రింకూ సింగ్ మ్యాచ్ ఫినిషర్ పాత్రను సరిగ్గా పోషిస్తే జట్టులో ఉంటాడు. లేదంటే తిరిగి జట్టులోకి రావడం చాలా కష్టం.
5. యువ పేసర్లు అశోక్ శర్మ, మయాంక్ కోసం
జింబాబ్వేతో జరిగే ఈ టీ20 సిరీస్లో యువ ఫాస్ట్ బౌలర్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ వంటి సీనియర్లు లేకపోవడంతో.. అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ లాంటి యువ బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి. ఈ యువ బౌలర్ల కోసం అయినా ఈ ఇండియా vs జింబాబ్వే టీ20 సీరిస్ ఫాలో అవ్వాల్సిందే.

