MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • స్టాక్ మార్కెట్ టుడే: 2021 చివరి రోజు సెన్సెక్స్ 500 పాయింట్లు ర్యాలీ.. 17,344కి చేరుకున్న నిఫ్టీ..

స్టాక్ మార్కెట్ టుడే: 2021 చివరి రోజు సెన్సెక్స్ 500 పాయింట్లు ర్యాలీ.. 17,344కి చేరుకున్న నిఫ్టీ..

ఈ ఏడాది చివరి ట్రేడింగ్ రోజైన నేడు శుక్రవారం స్టాక్ మార్కెట్(stockmarket)  ఉదయం లాభాలతో ప్రారంభమైంది.  ట్రేడింగ్ తర్వాత చివరకు గ్రీన్ మార్క్‌తో ముగిసింది. బిఎస్‌ఇ(bse)లోని 30 షేర్ల సెన్సెక్స్(sensex) 459 పాయింట్ల జంప్‌తో 58,253 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ(nse) సూచీ నిఫ్టీ(nifty) 150 పాయింట్ల లాభంతో 17,344 వద్ద ముగిసింది.

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Dec 31 2021, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈరోజు  269 పాయింట్ల జంప్‌తో సెన్సెక్స్ మళ్లీ 58 వేల స్థాయికి చేరుకుని ట్రేడింగ్ ప్రారంభించింది. సెన్సెక్స్ 58,083 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ కూడా గ్రీన్ మార్క్‌లో ట్రేడింగ్ ప్రారంభించి 80 పాయింట్లు లాభపడి 17,284 వద్ద ప్రారంభమైంది. గురువారం రెండు సూచీలు స్వల్ప క్షీణతతో రెడ్ మార్క్‌లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పాజిటివ్‌ ట్రెండ్‌ కనిపిస్తుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. మరోవైపు ఎఫ్‌ అండ్‌ ఓ గడువు డిసెంబరు 30తోనే ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు.

24

ఉదయం 9:15 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 55 పాయిం‍ట్లు లాభపడి 57,849 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,244 దగ్గర కొనసాగుతోంది.  ఇంట్రాడే ట్రేడ్‌లో 30-స్టాక్ గేజ్ 1% పైగా పెరిగింది. నిఫ్టీ కూడా ఇదే మాగ్నిట్యూడ్‌తో 17,354.05 వద్దకు చేరుకుంది. హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అత్యధికంగా 5.8% పెరిగింది. నేడు 50 షేర్లలో 44 పెరగగా, ఆరు పడిపోయాయి.

34

S&P BSE మిడ్‌క్యాప్ 1.38% లాభపడగా, S&P BSE స్మాల్‌క్యాప్ దాదాపు 1.2% జోడింపుతో లాభపడ్డాయి.జనవరి 8, 2002తో ముగిసిన కాలం నుండి హెచ్‌సి‌ఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు వరుసగా తొమ్మిదవ రోజు పెరిగాయి. ఈ క్రమంలో హెచ్‌సి‌ఎల్ టెక్ మొత్తం 14% లాభపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఐ‌టి ఇండెక్స్ అదే కాలంలో 5.9% పెరిగింది.

44

నేడు హిందాల్కో, టైటాన్ కంపెనీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఇలో ఎన్‌టిపిసి, సిప్లా, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అగ్రస్థానంలో ఉన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.40 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 1.41 శాతం పెరగడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా ముగిశాయి. కరెన్సీ మార్కెట్లో 2021 చివరి ట్రేడింగ్ రోజు యూ‌ఎస్ డాలర్‌తో రూపాయి 13 పైసలు పెరిగి 74.29 (తాత్కాలిక) వద్ద స్థిరపడింది.
 
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Investment: ర‌క్ష‌ణ రంగానికి పెరుగుతోన్న డిమాండ్‌.. ఈ స్టాక్స్‌లో పెట్టుబ‌డి పెడితే భారీ లాభాలు ఖాయం
Recommended image2
Ambani House : నెలనెలా యాంటీలియా కరెంట్ బిల్లు ఖర్చే అంతా..! ఓ BMW కారు కొనొచ్చుగా..!!
Recommended image3
E commerce: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌పై జ‌రిమానా.. వాటిని విక్రయిస్తున్నారన్న కారణంతో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved