MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Samsung : భారతీయులకు బంపరాఫర్... శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గేలా ఉన్నాయండోయ్..!

Samsung : భారతీయులకు బంపరాఫర్... శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గేలా ఉన్నాయండోయ్..!

భారత్ లో శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గనున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకిలా ధరలు తగ్గే అవకాశాలున్నాయంటే… 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 10 2025, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రంప్ సుంకాలతో భారత్ కు లాభమే...
Image Credit : Samsung website

ట్రంప్ సుంకాలతో భారత్ కు లాభమే...

Samsung : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఎన్నికల హామీ 'అమెరికా ఫస్ట్' పాలసీని అమలు చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు. వివిధ దేశాలపై ఆయన విధిస్తున్న ప్రతీకార పన్నులు ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలా భారత్ పై కూడా ట్రంప్ పన్నులు వేసేందుకు సిద్దమయ్యారు... కానీ మిగతా దేశాలతో పోలిస్తే ఇవి కాస్త తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇది ఇండియాకు బాగా కలిసివస్తోంది.

ఇప్పటికై చైనాపై అమెరికా అత్యధిక టారీఫ్స్ విధించడంతో దిగ్గజ అమెరికన్ మొబైల్ ఫోన్స్ కంపనీ యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో తమ ఉత్పత్తులను తగ్గించి భారత్ లో పెంచాలని నిర్ణయించింది.. ఇదే బాటలో ఇప్పుడు కొరియన్ కంపెనీ కూడా నడుస్తోంది. 

ట్రంప్ సర్కార్ ఇప్పటికే వియత్నాంపై భారీ సుంకాలను విధించేందుకు సిద్దమయ్యింది... ఈ క్రమంలో అక్కడ ఉత్పత్తిని తగ్గించాలని ఈ దక్షిణ కొరియాకు చెందిన సెల్ ఫోన్ల తయారీ దిగ్గజం భావిస్తోంది. ఇదే సమయంలో భారత్ లో ఉత్పత్తిని పెంచాలని భావిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత్ లో ఉత్పత్తి పెంచడంవల్ల శామ్సంగ్ కు లాభాలివే..
Image Credit : Samsung website

భారత్ లో ఉత్పత్తి పెంచడంవల్ల శామ్సంగ్ కు లాభాలివే..

అమెరికా సుంకాల భారం తగ్గడమే కాదు భారత్ లో శామ్సంగ్ తమ ఉత్పత్తులను పెంచడంద్వారా ఇంకెన్నో లాభాలున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉంటుంది... అలాగే అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి ప్రపంచంలోని అనేక దిగ్గజ సంస్థలు ఇక్కడినుండి కార్యకలాపాలు సాగించేందుకు సిద్దమవుతున్నాయి.

భారతదేశంలో చీఫ్ లేబర్ తో పాటు తక్కువ ఖర్చుతోనే ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి. టెక్నాలజీ కూడా బాగా అందుబాటులో ఉంది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. కాబట్టి అమెరికా టారీఫ్స్ పెంచినా తగ్గిన ఉత్పత్తి ఖర్చు కలిసివచ్చే అవకాశాలున్నాయి. అందుకే యాపిల్ అయినా, ఇప్పుడు శామ్సంగ్ అయినా ఇండియాలో తమ ఉత్పత్తుల తయారీకి ఆసక్తి చూపిస్తున్నాయి.

Related Articles

Related image1
చైనాకు ట్రంప్ మరో షాక్... ఈసారి ఏకంగా 245% టారీఫ్స్
Related image2
Trump Tariff: ట్రంప్ మ‌రో పిడుగు, 200 శాతం సుంకాలు.. భార‌త్‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌నుందంటే.?
35
భారత్ లో ఉత్పత్తి పెంచడంపై శామ్సంగ్ ఏమంటోంది?
Image Credit : Samsung Newsroom

భారత్ లో ఉత్పత్తి పెంచడంపై శామ్సంగ్ ఏమంటోంది?

ఇప్పటికే భారతదేశంలో శామ్సంగ్ కంపనీ వస్తువులు భారీగానే ఉత్పత్తి అవుతున్నాయి... ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో స్మార్ట్ ఫోన్ల తయారీ ఫ్యాక్టరీ ఉంది. అయితే ఇక్కడ ఉత్పత్తయ్యే ఫోన్లు కేవలం దేశీయ వినియోగానికే ఉపయోగిస్తున్నారు. 

ఇక వియత్నాంలో తయారయ్యే ఉత్పత్తులను అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది శామ్సంగ్. కానీ ఇప్పుడు వియత్నాంలో ఉత్పత్తి తగ్గించి ఇండియాలో పెంచాలని... ఇక్కడినుండే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని నిర్ణయించినట్లు శామ్సంగ్ అధికారులు చెప్పకనే చెబుతున్నారు.

''శామ్సంగ్ ఉత్పత్తులు వివిద దేశాల్లో తయారవుతున్నాయి. అయితే ప్రస్తుతం అమెరికా నిర్ణయాలవల్ల ప్రపంచ వాణిజ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వీటిని మేము నిశితంగా గమనిస్తున్నాం. అమెరికాకు తమ ఉత్పత్తులను సరఫరా చేసేందుకు వివిధ ప్యాక్టరీలను సిద్దం చేస్తున్నాం. ఇందులో ఇండియాలోని కంపనీలు  కూడా ఉన్నాయి'' అని శామ్సంగ్ గ్లోబల్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వోన్ జూన్ చోయ్ వెల్లడించారు.

45
ఇక ఇండియా నుండే అమెరికాకు శామ్సంగ్ ఎగుమతులు...
Image Credit : Samsung website

ఇక ఇండియా నుండే అమెరికాకు శామ్సంగ్ ఎగుమతులు...

ఇప్పటికే ఇండియాలో తయారయ్యే తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నట్లు చోయ్ వెల్లడించారు. ఇకపై ఇది మరింత పెరిగే అవకాశాలున్నాయని... భారత్ తమ ప్రధాన ఎగుమతిదారుగా మారవచ్చు అనేలా శామ్సంగ్ సిఓఓ ఆసక్తికర ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో ఇండియాలో శామ్సంగ్ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది.

55
శామ్సంగ్ ఫోన్ల ధరలు తగ్గుతాయా?
Image Credit : pinterest

శామ్సంగ్ ఫోన్ల ధరలు తగ్గుతాయా?

శామ్సంగ్ కంపెనీ ప్రధానంగా స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. అలాగే వివిధ రకాల ఎలక్ట్రానిక్ గృహోపకరణాలతో కూడా ఉత్పత్తి చేస్తుంది. కెమికల్స్, ఫైనాన్స్ రంగాల్లో కూడా ఉంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక సంస్థగా మారింది. భారతదేశంలో కూడా శామ్సంగ్ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంది.

అయితే తాజాగా శామ్సంగా తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయులకు మేలుచేసే అవకాశాలున్నాయి. ఈ దేశంలో ఉత్పత్తిని పెంచడం ద్వారా శామ్సంగ్ ధరలు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా శామ్సంగ్ స్మార్ట్ ఫోన్లు ఉత్పత్తిని పెంచి అమెరికాకు ఎగుమతి చేయడంతో పాటు దేశీయంగా అమ్మకానికి పెట్టనుండి. ఈ దేశంలో తయారయ్యే వస్తువులకు సుంకాలు తక్కువగా ఉంటాయి... కాబట్టి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ట్రంప్ టారిప్స్ నిర్ణయం భారత్ కు కొన్ని విషయాల్లో మేలుచేసేలా ఉన్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
డొనాల్డ్ ట్రంప్
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
చైనాకు ట్రంప్ మరో షాక్... ఈసారి ఏకంగా 245% టారీఫ్స్
Recommended image2
Trump Tariff: ట్రంప్ మ‌రో పిడుగు, 200 శాతం సుంకాలు.. భార‌త్‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌నుందంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved