MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇండియన్ బిలియనీర్స్ క్లబ్: కరోనాకాలంలో కూడా పెరుగుతున్న సంపన్నుల సంఖ్య.. మళ్ళీ టాప్ లో అంబానీ..

ఇండియన్ బిలియనీర్స్ క్లబ్: కరోనాకాలంలో కూడా పెరుగుతున్న సంపన్నుల సంఖ్య.. మళ్ళీ టాప్ లో అంబానీ..

 కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో న్యూ ఇయర్  కోసం ప్రజలు  ప్రణాళికలు కూడా ప్రారంభించారు. గత సంవత్సరం గురించి మాట్లాడితే 2021 పెట్టుబడిదారులకు గొప్పది. ఒకవైపు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంపద రూ.72 లక్షల కోట్లు పెరిగితే, మరోవైపు దేశంలోని బిలియనీర్ల సంఖ్య 126కు పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు.

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Dec 27 2021, 02:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mukesh Ambani

Mukesh Ambani

2020లో  85 మంది బిలియనీర్లు  
గత ఏడాదిన్నర కాలంగా స్టాక్ మార్కెట్‌లో బిలియనీర్లు వృద్ధి చెందారు. 1 బిలియన్  డాలర్ల (సుమారు రూ. 75,000 కోట్లు) నికర విలువ కలిగిన ప్రమోటర్లు ఇంకా వ్యాపారవేత్తల సంఖ్య 2020లో 85 నుండి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 126కి పెరిగింది. ఈ బిలియనీర్ ప్రమోటర్ల ఏకీకృత ఆస్తులు డిసెంబర్ 2020లో 494 బిలియన్ డాలర్లు అంటే రూ. 37 లక్షల కోట్లు నుండి దాదాపు 728 బిలియన్లు డాలర్లకు అంటే సుమారు రూ. 54.6 లక్షల కోట్లు చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మొత్తం సంపద జి‌డి‌పిలో 25 శాతం
ఒక నివేదిక ప్రకారం, ఈ జాబితాలోని 126 మంది బిలియనీర్ల ఏకీకృత సంపద 2022 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన దేశ గ్రాస్ డోమస్టిక్  ప్రాడక్ట్(GDP)లో దాదాపు 25 శాతానికి సమానం. గతేడాది బిలియనీర్ల జీడీపీతో సంపద నిష్పత్తి 18.6 శాతంగా ఉంది. నివేదిక ప్రకారం, గత ఏడాదిన్నర కాలంగా దలాల్ స్ట్రీట్‌లో బలమైన ర్యాలీ ఇంకా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లలో (IPOs) అపూర్వమైన పెరుగుదల భారతదేశంలో బిలియనీర్ ప్రమోటర్ల సంఖ్యను పెంచుతూనే ఉంది.

35
Mukesh Ambani

Mukesh Ambani

Mukesh Ambani

45

అత్యంత వేగంగా వృద్ధి చెందిన అదానీ సంపద
అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ వరుసగా రెండో సంవత్సరం సంపద జోడింపులో అతిపెద్ద ప్రమోటర్. అదానీ గ్రూప్ నికర విలువ 2021లో 82.43 బిలియన్ల డాలర్లు, ఇది డిసెంబర్ 2020 నాటికి 40 బిలియన్ల డాలర్ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ. 2019లో అతని విలువ 20 బిలియన్ డాలర్లు. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల కంబైనేడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ డిసెంబర్ 2020లో రూ.4.27 లక్షల కోట్ల నుండి ఈ ఏడాది ఇప్పటివరకు 133 శాతం పెరిగి రూ.9.87 లక్షల కోట్లకు చేరుకుంది. 

55

ఈ పారిశ్రామికవేత్తల సంపద కూడా 
ఐటీ కంపెనీల షేర్లు పెరగడంతో పారిశ్రామికవేత్తల సంపద లాభపడ్డాయి. 30.1 బిలియన్ల నికర విలువతో దేశంలో నాల్గవ అత్యంత సంపన్న ప్రమోటర్‌గా ఉన్న అవెన్యూ సూపర్‌మార్ట్‌కు చెందిన ఆర్‌కె దమానీ అగ్ర పారిశ్రామికవేత్తలలో కూడా ఉన్నారు. గతేడాది అతని నికర విలువ 18.4 బిలియన్ డాలర్లు. బజాజ్ గ్రూప్‌కు చెందిన రాహుల్ బజాజ్ ఆస్తులు కూడా గణనీయంగా పెరిగాయి. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: నెల‌కు రూ. 12 వేలు ప‌క్క‌న పెడితే రూ. 43 ల‌క్ష‌లు జ‌మ చేయొచ్చు.. జ‌స్ట్ 15 ఏళ్ల‌లోనే
Recommended image2
House Construction: వంద గజాల్లో ఒక అంతస్తు ఇంటిని కడితే ఎంత ఖర్చవుతుంది? దేనికి ఎంత పెట్టాలి?
Recommended image3
Jio Freedom Plan: ఎయిర్‌టెల్‌ను దెబ్బకొడుతూ జియో కొత్త ఫ్రీడమ్ ప్లాన్..అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఫ్రీ OTT కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved