MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రేపే జి‌ఎస్‌టి సమావేశం.. రేట్ల తగ్గింపుపై కీలక నిర్ణయం.. హాజరుకానున్న ఆర్థిక మంత్రి..

రేపే జి‌ఎస్‌టి సమావేశం.. రేట్ల తగ్గింపుపై కీలక నిర్ణయం.. హాజరుకానున్న ఆర్థిక మంత్రి..

 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitaraman) నేతృత్వంలో డిసెంబర్ 31న జరగనున్న జి‌ఎస్‌టి కౌన్సిల్(gst council) సమావేశం చాలా కీలకంగా మారింది. ఇందులో ఇతర అంశాలతో పాటు జీఎస్టీ రేట్ల తగ్గింపుపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. 12% ఇంకా 18% జిఎస్‌టి రేట్లను విలీనం చేసి ఒకే రేటును ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి.  

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Dec 30 2021, 12:02 PM IST| Updated : Dec 30 2021, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రేట్ల తగ్గింపుపై మంత్రుల బృందం తన నివేదికను కౌన్సిల్‌కు సమర్పించింది. జీరో జీఎస్టీ ఉన్న కొన్ని ఉత్పత్తులను రెండు రేట్ల విలీనం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. టెక్స్‌టైల్ రంగంపై 12% జీఎస్టీ విధించడాన్ని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి వ్యతిరేకించారు. సూరత్‌తో పాటు పలు చోట్ల వస్త్ర వ్యాపారులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 
 

25

పెట్టుబడులను పెంచేందుకు 19 విభాగాల్లో ఏర్పాటు చేసిన పి‌డి‌సి 
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రి అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రమోషన్ (DPIIT) పెట్టుబడిని పెంచడానికి 19 విభాగాలలో ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్ (PDC)ని సృష్టించింది. ఈ సెల్  పని ఏంటంటే  దేశీయ ఇంకా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. దేశంలో 60 వేలకు పైగా స్టార్టప్‌లు అభివృద్ధి చెందుతున్నాయని పరిశ్రమల శాఖ తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పర్యావరణ వ్యవస్థగా అవతరించింది. ఇంకా టైర్-1 నగరాల్లో 45% స్టార్టప్‌లు ఏర్పడ్డాయి.  ఈ స్టార్టప్‌లు 2021లోనే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాయి. 
 

35

జి‌ఎస్‌టి వార్షిక రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు 
2020-21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వార్షిక రిటర్న్‌ల దాఖలు గడువును ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వం బుధవారం పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చి 2021తో ముగుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఫారమ్ GSTR-9 ఇంకా ఫారమ్ GSTR-9Cలో సెల్ఫ్-అటెస్టెడ్  రికన్సిలేషన్ వివరాలను సమర్పించడానికి గడువు తేదీని పొడిగించినట్లు ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ బోర్డు ట్వీట్ చేసింది.
 

45

GSTR-9 అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) కింద నమోదైన పన్ను చెల్లింపుదారులు ఏటా దాఖలు చేసే వార్షిక రిటర్న్. అంటే వివిధ ట్యాక్స్ హెడ్‌ల క్రింద తయారు చేసిన లేదా పొందిన ఇన్ వార్డ్ అండ్ ఔట్ వార్డ్ సంబంధించిన వివరాలను కలిగి ఉంటుంది. GSTR-9 అనేది GSTR-9C ఇంకా ఆడిట్ చేసిన వార్షిక ఆర్థిక నివేదికల మధ్య  రికన్సిలేషన్ స్టేట్మెంట్.

55

మొత్తం వార్షిక టర్నోవర్‌ రెండు కోట్ల కంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వార్షిక రిటర్న్‌ను దాఖలు చేయడం తప్పనిసరి, అయితే ఐదు కోట్ల కంటే ఎక్కువ మొత్తం టర్నోవర్ కలిగిన నమోదిత వ్యక్తులు మాత్రమే  రికన్సిలేషన్ స్టేట్మెంట్ అందించాలి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇండియా H.O.G ర్యాలీ 2025కి ఫ్యూయలింగ్ పార్టనర్‌గా.. నయారా ఎనర్జీ
Recommended image2
బుర్రపాడు.. టైప్ సీ ఛార్జర్‌తో రీఛార్జ్ చేసుకునే బ్యాట‌రీలు.. ధ‌ర ఎంతంటే.?
Recommended image3
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కు సాధ్యంకానిది... మీషోకు ఇంత తక్కువ ధర ఎలా సాధ్యం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved