MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Currency: ఇప్పుడున్న నోట్లన్నీ రద్దు కానున్నాయా.? ATMలు అన్నీ మూత పడనున్నాయా.?

Currency: ఇప్పుడున్న నోట్లన్నీ రద్దు కానున్నాయా.? ATMలు అన్నీ మూత పడనున్నాయా.?

Currency: భార‌త‌దేశంలో మ‌రోసారి నోట్ల ర‌ద్దుపై చ‌ర్చ మొద‌లైంది. అయితే ఈసారి సాధార‌ణ కాగితపు నోట్ల స్థానంలో పాలిమర్ నోట్లు తీసుకురావాలని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో.. పాత నోట్ల‌న్నీ ర‌ద్దు చేయ‌నున్నారా అన్న అనుమానం మొదలైంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 21 2026, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇప్పుడున్న నోట్లన్నీ రద్దు కానున్నాయా.?
Image Credit : Gemini AI

ఇప్పుడున్న నోట్లన్నీ రద్దు కానున్నాయా.?

ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.10 నుంచి రూ.500 వరకు అన్ని కాగితపు నోట్లు యథావిధిగా చెల్లుబాటులోనే కొనసాగుతాయి. పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాలనే అంశం ఇంకా పరిశీలన దశలోనే ఉంది. దీనిపై ఆర్‌బీఐ ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం ప్రకటించలేదు. మొదటి దశలో చిన్న విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లతో ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశమే ఎక్కువగా ఉందని రిపోర్టులు సూచిస్తున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతేనే తదుపరి దశలో ఇతర నోట్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న కాగితపు నోట్లు ఒక్కసారిగా రద్దు అవుతాయనే ప్రచారంలో నిజం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏటీఎమ్‌లన్నీ మూత పడనున్నాయా.?
Image Credit : X

ఏటీఎమ్‌లన్నీ మూత పడనున్నాయా.?

కొత్త పాలిమర్ నోట్లు వస్తే దేశంలోని ఏటీఎంలన్నీ పనిచేయవని కొందరు భావిస్తున్నారు. కానీ వాస్తవానికి అలాంటి పరిస్థితి ఉండదు. పాలిమర్ నోట్లు కాగితపు నోట్లతో పోలిస్తే మందం, ఉపరితలం, వంగే తీరు వంటి అంశాల్లో కొంత భిన్నంగా ఉంటాయి. అందువల్ల కొన్ని ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్, సెన్సర్లు లేదా నగదు పంపిణీ వ్యవస్థలో చిన్నపాటి సాంకేతిక మార్పులు చేయాల్సి రావచ్చు. ఈ అప్‌గ్రేడ్‌లను దశలవారీగా పూర్తి చేస్తారు. అందువల్ల ఏటీఎంలు మూతపడటం లేదా నగదు ఉపసంహరణ ఆగిపోవడం వంటి పరిస్థితులు తలెత్తే అవకాశం లేదు.

Related Articles

Related image1
Smart Wallet: ఇక పర్స్ పోతుందనే భయమే ఉండదు.. యాంటీ లాస్ట్ అలర్ట్‌తో స్మార్ట్ వాలెట్
Related image2
అహంకారం త‌ల‌కెక్కితే కాలం గుణపాఠం చెబుతుంది.. అన్నీ ఉన్న‌ప్పుడే నువ్వెంటో తెలిపే క‌థ
35
నోట్ల లెక్కింపు యంత్రాలకు మార్పులు అవసరమా.?
Image Credit : Asianet News

నోట్ల లెక్కింపు యంత్రాలకు మార్పులు అవసరమా.?

బ్యాంకులు, వ్యాపార సంస్థలు, నగదు నిర్వహణ కేంద్రాల్లో ఉపయోగించే నోట్ల లెక్కింపు యంత్రాలు కూడా కొత్త నోట్లకు అనుగుణంగా అప్‌డేట్ చేయాల్సి రావచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న యంత్రాలు కాగితపు నోట్ల లక్షణాల ఆధారంగా రూపొందించారు. పాలిమర్ నోట్లు భిన్నమైన పదార్థంతో తయారవుతుండటంతో వాటిని కచ్చితంగా గుర్తించేలా యంత్రాల్లో సాంకేతిక మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది కొత్త కరెన్సీ సిరీస్ విడుదలైన ప్రతిసారి జరిగే సాధారణ ప్రక్రియగానే నిపుణులు చెబుతున్నారు.

45
పాలిమర్ నోట్లతో ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి.?
Image Credit : PTI

పాలిమర్ నోట్లతో ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి.?

పాలిమర్ నోట్ల ప్రధాన ఆకర్షణ వాటి మన్నిక. ఇవి సాధారణ కాగితపు నోట్ల కంటే చాలా ఎక్కువకాలం ఉపయోగించుకోవచ్చు. సులభంగా చిరిగిపోవు. నీరు, తేమ వల్ల దెబ్బతినే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అలాగే వీటిపై దుమ్ము, మురికి, బ్యాక్టీరియా తక్కువగా పేరుకుపోతాయి. దీంతో పరిశుభ్రత కూడా మెరుగ్గా ఉంటుంది. మరో ముఖ్యమైన ప్రయోజనం భద్రత. పారదర్శక విండోలు, ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్లు, అధునాతన ముద్రణ సాంకేతికతను ఉపయోగించడం వల్ల నకిలీ నోట్లు తయారు చేయడం మరింత కష్టమవుతుంది. అందుకే ఇప్పటికే అనేక దేశాలు పాలిమర్ కరెన్సీని విజయవంతంగా వినియోగిస్తున్నాయి.

55
ఆర్‌బీఐ తదుపరి ప్రణాళిక ఏంటి.?
Image Credit : Asianet News

ఆర్‌బీఐ తదుపరి ప్రణాళిక ఏంటి.?

పాలిమర్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలన దశలోనే ఉంది. పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు, ఖర్చులు, ప్రయోజనాలు, సాంకేతిక అవసరాలు, ప్రజల స్పందన వంటి అంశాలను పూర్తిగా విశ్లేషించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నికగా ఉండటంతో తరచూ కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో దీర్ఘకాలంలో కరెన్సీ ముద్రణ, పంపిణీపై అయ్యే ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. పైలట్ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పాలిమర్ నోట్లను దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశాలపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

కాబ‌ట్టి ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న కాగితపు నోట్లు వెంటనే రద్దు అవుతాయ‌ని జ‌రుగుతోన్న ప్ర‌చారంలో నిజం లేదు. అలాగే ఏటీఎంలు కూడా మూతపడవు. పాలిమర్ నోట్లు అమల్లోకి వచ్చినా కొంతకాలం పాటు కాగితపు నోట్లు, పాలిమర్ నోట్లు రెండూ ఒకేసారి చలామణిలో ఉంటాయి. కాబ‌ట్టి ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Debt Free Guide: అప్పుల ఊబిలో మునిగిపోతున్నారా? ఈ 5 సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా అప్పులన్నీ తీర్చేయండి!
Recommended image2
EPFO Vishwas 2026: యాజమాన్యాలకు, ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ బంపర్ ఆఫర్.. అస్సలు మిస్ కావద్దు !
Recommended image3
Gold Rate Hike: అంతర్జాతీయ మార్కెట్‌లో యుద్ధ భయాలు..మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు
Related Stories
Recommended image1
Smart Wallet: ఇక పర్స్ పోతుందనే భయమే ఉండదు.. యాంటీ లాస్ట్ అలర్ట్‌తో స్మార్ట్ వాలెట్
Recommended image2
అహంకారం త‌ల‌కెక్కితే కాలం గుణపాఠం చెబుతుంది.. అన్నీ ఉన్న‌ప్పుడే నువ్వెంటో తెలిపే క‌థ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved