జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న జూనియర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన జనతా గ్యారేజ్ ఆ స్థాయిలో తదుపరి చిత్రం ఉండాలని వెయిటింగ్ కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఫిబ్రవరిలో ఎన్టీఆర్ చిత్రం ప్రారంభం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు త‌న త‌దుపరి చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప‌వ‌ర్‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రాల డైరెక్ట‌ర్ బాబీ(కె.ఎస్‌.ర‌వీంద్ర‌ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్‌రామ్ ఈ సినిమాను నిర్మించ‌నున్నాడు. ఈ సినిమాకు జై ల‌వ‌కుశ అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్న ఈ సినిమాకు బాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్ ముర‌ళీధ‌ర‌న్ కెమెరా వ‌ర్క్‌ను అందించ‌నున్నారు.

ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 11న లాంచ‌నంగా ప్రారంభిస్తార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్. జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత త‌న నెక్ట్స్ మూవీకి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కొత్త సినిమా మేకోవ‌ర్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ు జ‌రుపుకుంటోంది.