Asianet News TeluguAsianet News Telugu

ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ప్రవర్తనపై విమర్శలు.. స్పందించిన రౌడీ హీరో.!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం  ‘లైగర్’ ప్రమోషన్స్ లో బిజీగా  ఉన్నారు. రీసెంట్ గా ఓ ప్రెస్ట్ మీట్ లో పాల్గొన్న విజయ్ ప్రవర్తన సరిగా లేదంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా రౌడీ హీరో స్పందించారు.
 

Criticisms on Vijay Deverakondas behavior in the press meet, The rowdy hero responded!
Author
Hyderabad, First Published Aug 19, 2022, 5:47 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన సినిమాలను  ఇతర స్టార్స్ కంటే భిన్నంగా ప్రమోట్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే.  అయితే తాజాగా ఆయన నటించిన పాన్ ఇండియా చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో వరుస ప్రెస్ మీట్లతో తమ సినిమాను ప్రమోట్ చేస్తుండగా.. విజయ్ ప్రవర్తన సరిగా లేదంటూ విమర్శలు తలెత్తాయి. దీనిపై తాజాగా విజయ్ స్పందించారు. వరుస చిత్రాలతో తన అభిమానులను అలరిస్తున్నారు. విభిన్న కథాంశాలతో ఇండస్ట్రీలో మెరుపు వేగంతో దూసుకుపోతున్నాడు. గత రెండు, మూడు చిత్రాలకు విజయ్ కు ఆశించిన మేరకు ఫలితాలనివ్వలేదు. దీంతో తన అప్ కమింగ్ ఫిల్మ్ ‘లైగర్’(Liger)పైనే ఆశలు పెట్టుకున్నారు. 

సెన్సేషనల్ స్టార్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) - విజయ కాంబినేషనల్ లో తొలిసారిగా రూపుదిద్దుకుంటున్న Liger. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో చిత్రీకరించారు. ఆగస్టు 25న ఈ  స్పోర్ట్స్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, హిందీలో రూపొందించిన ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. వారం రోజుల్లో చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో విజయ్ ప్రవర్తన కాస్తా తప్పు ఉందని పలువురు విమర్శించారు. ఈమేరకు సోషల్ మీడియాలోనూ వార్తలు పుట్టుకొచ్చాయి. 

దీనిపై ఓ జర్నలిస్టు స్పందిస్తూ ఆ రోజు జరిగిన ఘటనను వివరించాడు. ‘విజయ్ జర్నలిస్టులతో మంచిగా ఉన్నారని తెలిపారు. గతంతో పోల్చితే విజయ్ తో మాట్లాడలంటే కాస్తా ఇబ్బందిగా ఉందని అనడంతో.. ఆయన సరదాగా మాట్లాడారని, ప్రెస్ మీట్లలో కాలుమీద కాలేసుకొని కూర్చొండి.. నేను అలాగే కూర్చుంటానని.. భరోసా మాట్లాడారని తెలిపాడు. తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. ఆ వీడియోను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఎవరైనా తమ రంగంలో ఎదగాలని ప్రయత్నిస్తారు. అలాంటి వారిని ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే ఉంటారు. అయినా పోరాడుతాం. నిజాయితీగా, ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటే ప్రజల ప్రేమ, దేవుడి దీవెనలు ఉంటాయని తెలిపారు.’ ప్రస్తుతం విజయ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.  

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తొలిసారి హిందీలోకి ‘లైగర్’తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. బాలీవుడ్ లోనూ రిలీజ్ అవుతున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోవడంతో ప్రస్తుతం ‘లైగర్’పైనే అచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ ప్రేక్షకులను హామీనిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే  (Ananya Panday) హీరోయిన్ గా నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మైక్ టైసన్, రమ్యక్రిష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios