Asianet News TeluguAsianet News Telugu

20 కోట్లకు పైగా ఆస్తులున్నా.. అద్దె ఇంట్లో ఉంటున్న కమెడియన్ వేణుమాధవ్ తల్లి, ఏమంటుందంటే..?

కోట్లకు ఆస్తులు ఉన్నా ఏం లాభం.. కొడుకు మరణంతో రొడ్డున పడ్డానంటోంది.. స్టార్ కమెడియన్ వేణు మాధవ్ తల్లి సావిత్రమ్మ. అద్దె ఇంట్లో జీవితం గడుపుతున్నామంటోంది. 

Comedian venu madhav mother Savitramma Special interview
Author
First Published Jan 31, 2023, 4:35 PM IST

కోదాడ నుంచి సాధారణ  మిమిక్రీ ఆర్టిస్ట్ గా జీవితాన్ని స్టార్ట్ చేశాడు వేణుమాధవ్ .  చాలా తక్కువ టైమ్ లోనే కమెడియన్ గా ఎదిగాడు. టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ స్టేటస్ ను చూశాడు. అంతే వేగంగా పడిపోయిన వేణుమాధవ్ అనారోగ్యం కారణంగా మరణించాడు. అయితే అప్పటికే ఆస్తులు మాత్రం బాగా సంపాదించుకున్నట్టు వేణు మాధవ్ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.  కాని ఇప్పటికీ వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ అద్దె ఇంట్లోనే  ఉంటున్నారట. ఈ విషయాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో   ప్రస్తావించారు. సావిత్రమ్మ.  


రీసెంట్ గా ఓ మీడియాతో మాట్లాడింది వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ. ఎమన్నదంటే.. నాకు ముగ్గురు మగపిల్లలు ఇద్దరు మగపిల్లలు.  వేణు మాధవ్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు .. మిమిక్రీ బాగా చేసేవాడు. అప్పుడే  ఒక ప్రోగ్రామ్ లో ఆయనను ఎస్వీ కృష్ణారెడ్డి - అచ్చిరెడ్డిగారు చూసి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాన్ని వేణు మాధవ్ బాగా ఉపయోగించుకున్నారు. ఇండస్ట్రీలో నటుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు.  చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. 

అయితే వేణుకి ఒక అలవాటు ఉంది.  ఎప్పుడు ఏ జబ్బు చేసినా మందులు వేసుకునేవాడు కాదు. తలనొప్పి వచ్చినా టాబ్లెట్ వేసుకునే  అలవాటు ఆయనకి లేదు.. అదే అతని  కొంపముంచింది  అన్నారు సావిత్రమ్మ. అయితే కొడుకు ఎదుగుదల చూసి సంతోషించానని.. సినిమాలతో వేణు మాధవ్ బిజీగా ఉండటం వలన నా ఇద్దరు కొడుకులను కూడా ఆయన దగ్గర అసిస్టెంట్లుగా చేశాను. అదే నేను చేసిన పెద్ద తప్పు అన్నారు సావిత్రమ్మ. 

దాని వల్ల  ఇద్దరు ఎదగలేకపోయారు.. మిగిలిని ఇద్దరు కొడుకులు జీవితంలో పెద్దగా స్థిరపడలేదు.. కూతురు పెళ్లి టెన్షన్ తో ఒక కొడుకు చనిపోయాడు. అతను చనిపోయిన  నెలా పదిహేను రోజుల్లోనే వేణుమాధవ్ కూడా చనిపోయాడు.  ఇద్దరు కొడుకుల చావు చూసి..నేను ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తంటుది అన్నారు ఆమె. ఇక వేణు మాధవ్ చనిపోయేనాటికే చాలా ఆస్తులు ఉన్నాయని.. ఏడెనిమిది ఫ్లాట్ లతో పాటు దాదాపు  20 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయన్నారు. అన్ని ఉన్నా తల్లిగా నాకు ఉపయోగం ఏమీలేవు..  నేను మాత్రం మరో కొడుకును చూసుకుంటూ.. అద్దె ఇంట్లో కాలం వెల్లదీస్తున్నాను. వేణు మాధవ్ బ్రతికుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని అన్నారు. సావిత్రమ్మ. తమ జీవితాన్ని తలుచుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios