టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' మహర్షి మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది. 

టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' మహర్షి మరో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాపై అంచనాలు పెరిగే విధంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ డోస్ పెంచింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో ప్రెస్ మీట్స్ తో రచ్చ చేసిన మహర్షి టీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రోమోలను రిలీజ్ చేస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక సినిమాలో మొదటగా విడుదలైన చోటి చోటి సాంగ్ వీడియో ప్రివ్యూని రిలీజ్ చేశారు. అందులో మహేష్ - పూజా - నరేష్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని చాలా బాగా చూపించారు. చిన్న ప్రోమోనే అయినా ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. మరి మే9న రిలీజ్ కాబోతున్న మహర్షి ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.