పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు పరిహారాన్ని అందిస్తామని మంత్రి జూపల్లి అన్నారు. నష్టపోయిన ప్రతి రైతును తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయరాదని తాము ఆదేశించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రానికి నేరపూరిత చర్య అని వివరించింది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు మీడియా సమావేశం నిర్వహించింది.
తులాభారాల పాలనలు మనిషి బరువుని దించలేకపోతున్నాయి అంటూ ఒబ్బిని రాసిన కవిత 'బరువు' ఇక్కడ చదవండి :
పవన్ కళ్యాణ్ను ఓడించేవారిలో టీడీపీ వాళ్లే ముందు ఉంటారని వైసీపీ ఆరోపించింది. దీనికి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తమదేనని పేర్కొంటూ జగన్ పైనా విమర్శలు సంధించింది.
పవన్ కళ్యాణ్ కాకినాడ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగే జనసేన అభ్యర్థిని ప్రకటించారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు.
పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వివరించారు. ఎమ్మెల్యేగా తన పని తీరు చూస్తే ఇక ఎప్పటికీ వదులుకోరని అన్నారు.
వరంగల్లో ఓ దుండగుడు తన వీర్యాన్ని ఐస్ క్రీంలో కలిపి అమ్ముతూ పట్టుబడ్డాడు. తోపుడు బండి వద్దే హస్త ప్రయోగం చేసుకుని ఐస్ క్రీంను కలుషితం చేశాడు. అధికారులు యాక్షన్ తీసుకున్నారు.
తెలంగాణలో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు ఇవే.