తెలంగాణ కాంగ్రెసు ఎంపీ అభ్యర్షుల రెండో జాబితా: నల్లగొండ నుంచి ఉత్తమ్
ఖమ్మం లోకసభ స్థానం అభ్యర్థిని మాత్రం పెండింగులో పెట్టింది. ఈ సీటు కోసం నామా నాగేశ్వర రావుతో పాటు రేణుకా చౌదరి పోటీ పడుతున్న నేపథ్యంలో పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో లోకసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇప్పటికే 8 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగామరో 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఖమ్మం లోకసభ స్థానం అభ్యర్థిని మాత్రం పెండింగులో పెట్టింది. ఈ సీటు కోసం నామా నాగేశ్వర రావుతో పాటు రేణుకా చౌదరి పోటీ పడుతున్న నేపథ్యంలో పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది.
టీపీసీసీ చీఫ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్కుమార్రెడ్డిని నల్లగొండ లోకసభ సీటుకు పోటీ చేయనున్నారు. మహబూబ్నగర్ స్థానానికి డీకే అరుణ, జి.మధుసూదన్రెడ్డి పేర్లపై చర్చ జరిగింది. అయితే, చివర్లో వంశీచంద్రెడ్డి పేరును ఖరారుచేసింది.
హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్, సికింద్రాబాద్ నుంచి అంజన్కుమార్ యాదవ్, నాగర్కర్నూల్ నుంచి మల్లు రవి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, నిజామాబాద్ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య బరిలో దిగనున్నారు.
తీవ్రంగా చర్చించిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని నల్లగొండ స్థానం నుంచి పోటీకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. ఒకవేళ ఉత్తమ్ గెలిస్తే.. హుజూర్నగర్నుంచి ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్లోని 22 ఎంపీ స్థానాలకు, 132 ఎమ్మెల్యే స్థానాలకు కూడా ఏఐసీసీ జాబితాను ప్రకటించింది.