తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
12:01 AM (IST) May 05
Miss World 2025 Event: మిస్ వరల్డ్ పోటీల వేదికపై తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర సంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని గ్లోబల్ స్థాయిలో ప్రదర్శించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మే 10 నుంచి 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో 120 దేశాల ప్రాతినిధ్యం ఉండగా, 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
11:24 PM (IST) May 04
PBKS vs LSG IPL 2025: ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ సూపర్ విక్టరీ కొట్టింది. బ్యాటింగ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్ సూపర్ నాక్ లకు తోడుగా, బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, ఓమర్జాయ్ అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ కింగ్స్ విక్టరీ కొట్టింది.
11:22 PM (IST) May 04
మీకు పర్సనల్ లోన్ కావాలా? క్రెడిట్ కార్డు తీసుకుంటారా? అంటూ అనవసరమైన ఫోన్ కాల్స్, మెసేజ్ లు వస్తున్నాయా? ఆఫీసు వర్క్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి స్పాస్ కాల్స్ ని అడ్డుకోవచ్చు, బ్లాక్ కూడా చేయొచ్చు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా, బిఎస్ఎన్ఎల్ ఏ నెట్వర్క్ అయినా స్పామ్ కాల్స్ని సులభంగా బ్లాక్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
పూర్తి కథనం చదవండి11:05 PM (IST) May 04
Indian CRPF Jawan Marrying Pakistani Woman: పెళ్లి... అది సాదాసీదా విషయం కాదు. ఓ భారత జవాన్, ఓ పాకిస్తానీ యువతితో ప్రేమలో పడితే? అది దేశ భద్రతను కదిలించే అంశంగా మారితే? ఇది సినిమాలా ఊహించిన కథల అనిపిస్తుంది కదా.. కానీ ఇది రీల్ స్టోరీ కాదు రియల్ స్టోరీ. పాకిస్తాన్ అమ్మాయి, భారత సీఆర్పీఎఫ్ జవాన్ వీడియో కాల్ పెళ్లి.. భారత్ లో కాపురం పెట్టిన స్టోరీ ఊహించని మలుపు తిరిగింది. ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
09:38 PM (IST) May 04
India-Pakistan tensions: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల మృతి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత ప్రభుత్వం పలు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లను భారత్లో బ్యాన్ చేసింది.
పూర్తి కథనం చదవండి09:37 PM (IST) May 04
1975లో విడుదలైన ‘షోలే’ సినిమా గురించి ఎవరు మర్చిపోగలరు? దానికి సంబంధించిన ఎన్నో కథలు ఉన్నాయి. అందులో ధర్మేంద్ర ధరించిన జీన్స్ని ఒక సూపర్స్టార్ కాలేజీకి వెళ్ళేందుకు ఉపయోగించేవారట.
పూర్తి కథనం చదవండి09:09 PM (IST) May 04
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ బాంద్రాలోని ఒక కేఫే బయట కనిపించారు. ఆమె వింత దుస్తులు ధరించి, జుట్టు చెల్లాచెదురుగా ఉండటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి09:03 PM (IST) May 04
liquor price hike in telangana: మద్యం ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మద్యం సంస్థల సమాఖ్య (CIABC) తెలంగాణ ప్రభుత్వాన్ని సరఫరా ధరలను పెంచేందుకు అనుమతించమని కోరింది. దీంతో మరోసారి మధ్య ప్రియులకు ధరల షాక్ తగిలే ఛాన్స్ ఉంది.
08:19 PM (IST) May 04
రష్మిక మందన్న సంవత్సరాలుగా రహస్యంగా ఉంచిన కొన్ని సెల్ఫీలను అభిమానులతో పంచుకున్నారు. వివిధ సందర్భాల్లో తీసుకున్న 8 సెల్ఫీలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు ఎక్కడా పోస్ట్ చేయని, ఎవరితోనూ షేర్ చేయని ఈ సెల్ఫీలు అభిమానులను ఆశ్చర్యపరిచాయి.
పూర్తి కథనం చదవండి08:06 PM (IST) May 04
జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడితో దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఓ పాకిస్తానీ నటి ఫోటోలు ముంబైలోని పబ్లిక్ టాయిలెట్లలో కనిపించాయి. ఆ నటి ఎవరో తెలుసుకోండి...
పూర్తి కథనం చదవండి07:56 PM (IST) May 04
పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టిగా స్పందించారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతదేశం చర్య తీసుకుంటుందని, శత్రువులను శిక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక బలాన్ని ఆయన ప్రశంసించారు.
పూర్తి కథనం చదవండి07:54 PM (IST) May 04
Tirupati Sri City: తిరుపతిలోని శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలం (సెజ్) లో LG రూ.5,001 కోట్లతో మూడో ఇండియా ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఎల్జీకి పుణే, నోయిడాల్లో ప్లాంట్లు ఉండగా, ఇప్పుడు ఏర్పాటు కాబోయేది భారతదేశంలో మూడో ప్లాంట్గా నిలవనుంది.
07:30 PM (IST) May 04
KKR vs RR IPL 2025: ఐపీఎల్ 2025 కోల్కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ పరాగ్ 95 పరుగులు సూపర్ నాక్ ఆడినా మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో కేకేఆర్ చేతిలో ఆర్ఆర్ ఓటమిపాలైంది.
పూర్తి కథనం చదవండి06:54 PM (IST) May 04
Riyan Parag: ఐపీఎల్ 2025 కోల్కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రియాన్ పరాగ్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. అద్భుతమైన ఆటతో కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ను దంచికొట్టాడు.
06:37 PM (IST) May 04
Telangana E-City: తెలంగాణ ఈ సిటీ ప్రాజెక్టు రాష్ట్ర పరిశ్రమల రంగానికి మైలురాయి కానుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ-సిటీ కేవలం పరిశ్రమల కేంద్రంగా మాత్రమే కాకుండా, యువతకు ఉద్యోగ అవకాశాల వేదికగా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా సాంకేతిక మద్దతుగా నిలవనుందని తెలిపారు.
06:33 PM (IST) May 04
ఎవరినైనా నవ్వించడం చాలా కష్టమైన పని అంటారు. కానీ ఈ కళతోనే భారతదేశంలో చాలా మంది కళాకారులు అపారమైన సంపదను ఆర్జించారు.
పూర్తి కథనం చదవండి05:47 PM (IST) May 04
CBSE Class 10 official result date: సీబీఎస్ఈ 2025 ఫలితాలపై తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మే 6, 2025న 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు విడుదల అవుతాయని పేర్కొంటూ వచ్చిన నకిలీ లేఖపై CBSE అధికారికంగా స్పందించింది.
05:32 PM (IST) May 04
ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన మిస్సైల్ దాడి తర్వాత ఢిల్లీ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని అబుదాబికి దారి మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా అబుదాబి చేరుకున్నారు, విమానం తిరిగి ఢిల్లీకి వస్తుంది.
పూర్తి కథనం చదవండి05:18 PM (IST) May 04
India-Pakistan war tensions: పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారత్ తో యుద్ధ భయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో (PoK) ప్రభుత్వం రెండు నెలల నిత్యావసరాలు నిల్వ చేయాలని ఆదేశించింది. ముజఫరాబాద్లో ఆహార ధాన్యాలు, పిండి సంచులు ట్రక్కులపై ఎక్కిస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి.
04:47 PM (IST) May 04
ఇండియా, పాకిస్తాన్ వైమానిక మార్గాలు మూసేయడంతో రెండు దేశాలకీ ఆర్థికంగా నష్టమే. మరి ఏ దేశానికి ఎక్కువ నష్టమో తెలుసా?
పూర్తి కథనం చదవండి04:38 PM (IST) May 04
పహల్గాం ఉగ్రదాడిని ఖండించినా పాకిస్థాన్ విషయంలో భారత విధానాలను సమర్దించకుండా చాలాదేశాలు తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి యూరప్ దేశాలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కౌంటర్ ఇచ్చారు.
పూర్తి కథనం చదవండి04:27 PM (IST) May 04
Telangana weather: తెలంగాణలో మే నెల మొత్తం తీవ్రమైన వేడిగాలులు, మండే ఎండలతో పాటు పిడుగుతో కూడిన వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 13 జిల్లాల్లో రాబోయే కొన్ని వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. అలాగే, హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
04:14 PM (IST) May 04
పరీక్షలో తప్పిన విద్యార్థులు తల్లిదండ్రులకు భయపడి ఆత్మహత్యలు చేసుకునే అనేక సంఘటనలు చూస్తుంటాం. కానీ ఈ పేరెంట్స్ లా ప్రతిఒక్కరు ఉంటే అసలు విద్యార్థులు ఆత్మహత్యలే ఉండవు. అంతగొప్ప పేరెంట్స్ ఎవరు? ఏం చేసారో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి04:04 PM (IST) May 04
అమెరికాకు చెందిన టిం ఫ్రిడే అనే వ్యక్తి 20 ఏళ్లలో 200 సార్లు కొండచిలువ, బ్లాక్ మాంబా వంటి విషపూరిత పాముల కాటుకు గురయ్యాడు. అంతేకాదు.. దాదాపు 700 సార్లు పాము విషాన్ని తన శరీరానికి ఇంజెక్షన్ చేయించుకున్నాడు. అతను ఇంకా బతికే ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
పూర్తి కథనం చదవండి03:29 PM (IST) May 04
Mothers Day: మదర్స్ డే ఈ ఏడాది మే 11న వచ్చింది. ఈ సందర్భంగా మీ అమ్మను సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏదో ఒక గిఫ్ట్ కొనే బదులు ఇక్కడ చెప్పిన గిఫ్ట్స్ ట్రై చేయండి. వీటిని చూసి మీ మదర్ కచ్చితంగా సంతోషపడతారు.
పూర్తి కథనం చదవండి03:00 PM (IST) May 04
జమ్మూ కాశ్మీర్లోని రంబన్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. దీంతో ముగ్గురు జవాన్లు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.
పూర్తి కథనం చదవండి02:05 PM (IST) May 04
సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాల ఫోటోలతో ఇతర కీలక సమాచారం శత్రుదేశం పాకిస్థాన్ కు చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్న ఇద్దరిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తి కథనం చదవండి01:47 PM (IST) May 04
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా త్రివిద దళాధిపతులతో భేటీ అవుతున్నారు.
పూర్తి కథనం చదవండి
01:15 PM (IST) May 04
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ ఓ క్షిపణి పరీక్ష జరిపినట్లు తెలుస్తోంది. ఇలా ప్రయోగించిన అబ్దాలీ క్షిపణి ప్రత్యేకతలేంటంటే...
పూర్తి కథనం చదవండి01:12 PM (IST) May 04
Diabetics: అసలే వేసవి.. ఎండలు మండిపోతుంటే చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. కాని డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం ఐస్ క్రీమ్ తినాలని ఉన్నా ఆరోగ్యం కోసం తినడం మానేస్తారు. అలాంటి డయాబెటిక్ పేషెంట్స్ కోసం షుగర్ లేని, క్రీమ్ లేని ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి12:44 PM (IST) May 04
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న వేళ ఆసక్తికర విషయమొకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికప్పుడు పాకిస్థాన్ కు యుద్దం చేయాల్సివస్తే ఎన్నిరోజులు చేయగలదో తెలుసా?
పూర్తి కథనం చదవండి
12:14 PM (IST) May 04
ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం, పప్పులు కచ్చితంగా ఉంటాయి. వాటిని ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా పురుగులు పట్టేస్తుంటాయి. అయితే పురుగు పట్టిన తర్వాత శుభ్రం చేసే కంటే అసలు పురుగులు పట్టకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
11:54 AM (IST) May 04
భారత్ పై పాక్ అణుబాంబులతో దాడికి రెడీగా ఉందని రష్యాలోని పాక్ రాయబారి ముహమ్మద్ ఖాలిద్ జమాలి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇరుదేశాల మధ్య ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల వేళ పాక్ రాయబారి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
పూర్తి కథనం చదవండి11:14 AM (IST) May 04
మీ ఇంట్లో పనిచేయడానికి పనిమనిషి కావాలా? ఒక్క క్లిక్ లేదా ఒక్క కాల్ తో మీ ఇంటికి పని మనిషి వచ్చేస్తుంది. గంటకు ఇంత అని ఛార్జ్ చేసి పనంతా పూర్తి చేసి వెళ్లిపోతుంది. ఈ ఫెసిలిటీ ఎక్కడుందో తెలుసా?
11:05 AM (IST) May 04
పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉంది. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వద్ద వరుసగా 10వ రోజు భారత భూభాగంవైపు కాల్పులకు తెగబడింది. వీరికి భారత సైన్యం దీటుగా బదులిచ్చింది.
పూర్తి కథనం చదవండి10:28 AM (IST) May 04
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఇరకాటంలో పెట్టిన ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. అతడు ఏకంగా తెలంగాణ సీఎస్, డిజిపిలతో పాటు ఇతర టాప్ అఫిషియల్స్ పై ఆరోపణలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు.
పూర్తి కథనం చదవండి10:18 AM (IST) May 04
పిడుగుపాటు నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పూర్తి కథనం చదవండి09:11 AM (IST) May 04
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో కూడా బిలియనీర్ల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. అందులో చాలా మంది అతి తక్కువ వయసులో బిలియనీర్ ఉన్నారు. అత్యంత పిన్న వయసులో వారు ఎలా ఇంత డబ్బు సంపాదించారు, వారి ఆస్తులు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి
09:01 AM (IST) May 04
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ఈజీగా సహాయం అందుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, జిల్లా పోలీసుల భక్తుల కోసం MAY I HELP YOU సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకూ ఏమిటీ సేవలు? ఎలా పొందవచ్చు? ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:32 AM (IST) May 04
రెండు లారీల మధ్య ఓ కారు నలిగిపోయి ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘోరం ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి